Saturday, June 24, 2017

మనుసుల మాట 11.

                                                        

సరుకుల పైన సేవా పన్ను కథా క్రమం:
క్రీ. పూ. 3000 సం. నాటికి మధ్య ఆసియా లో పామేరు పీఠభూమి(ఉత్తర కురు) భూ భాగం పైన ఇండో, ఇరానియన్ జాతి ప్రజలు తిరుగాడునాటికి ఈ భూమి మీద నామ మాత్రపు వ్యవీస్తీకృత జీవన  వ్యవస్త ఏర్పడినట్లుగా చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. విశాలమైన భూభాగం, సమృధ్ధిగా ఉన్న అటవీ సంపద, ఆరోగ్యకరమైన  పశుసంపద, వెరసి జానాభా అభివృధ్ధికి చాలినంత అవకాశం ఉన్న పరిస్తితులు. అంతకంటే ముందు తరాలవరకు  క్రూర జంతువుల ప్రమాదాలకు తోడు సభ్య సమూహాల ఆహార కరువు యుధ్ధాలు తోడవటం వలన సమూహాలు గణాలు గా మారి ప్రజాస్వామిక  గణ రాజ్యాలు ఏర్పడ్డాయి. అందరూ ఆహార అన్వేషణలో ఉత్పత్తిలో  పాల్గొంటారు, అవసరం అయితే అందరూ శత్రువుతో పోరాడుతారు. ఏ గణం లోని సభ్యుడు అయినా గణ నియమాల ప్రకారం తన చేతనైనంత పని చేస్తాడు, ఆకలైనంత ఆహారం తింటాడు, గణ నియమానుసారం సాంసారిక, సాంస్కృతిక కార్యక్రమాలల్లో తన పాత్ర నిర్వహిస్తాడు.

క్రీ.పూ. 2000 సం. నాటికి చిన్న చిన్న గణాలు మన లేని పరిస్తితీ , కొన్ని గణాలు కలిసి  రాజ్యాలు గా ఏర్పడితే తప్ప తమ జాతి సంఖ్యను పెంచుకోలేని, శత్రువు నుండి రక్షించుకోలేని  పరిస్తితి. రాజ్యం అంటే సైన్యం, సైన్యానికి అన్నపానీయాల కోసం అదనపు సంపద కావాలి. అదనపు సంపద సృస్టికి అంతవరదాక ఓడిపోయిన దాసులతో అలివిగాని చాకిరీ చేయించడం మొదలైంది. రాతి గొడ్డణ్లు పోయి రాగి గొడ్డణ్లు వచ్చినై, వ్యవసాయం వచ్చింది, మద్రులు, పర్శవులు, పురూవులు మొదలైన రాజ్యా వ్యవస్తలు  వచ్చినై. ఈ రాజ్యాల మధ్యన కూడా ఆధిపత్యం కోసం యుద్దాలు నిరంతరం సాగేవి.

క్రీ.పూ. 1800 సం. నాటికి సురులూ , అసురులు అన్న జాతుల మధ్యన పోరాటాలు మొదలైనట్లుగా చరిత్ర. శత్రువుల నుండి రక్షణ కోసం ఒకే చోట నివాసాలు ఉండి అవి  పట్టణాలు గా వెలుగొందడం, ఆ పట్టణాల రక్షణకు కోట గోడలు , పెద్దసంఖ్యలో సైన్యం  అవసరం పడుతాయి. అందుకని అప్పటికే అభివృధ్ధి చెందిన వ్యవసాయం లోనుండి కొంత శాతం పన్ను,  రాజుకు చెల్లించాలి. అందరి రక్షణ కోసం పాటుబడే రాజ్యానికి పన్నుచెల్లించడం అసమంజసం అని ఆ సమాజానికి ఏమీ అనిపించలేదు.  

క్రీ.పూ.1500 సం. కాలం నాటికి కురు పాంచాల ప్రాంతాలల్లో  వైదిక ఆర్యుల కాలం ఆరంభం అయింది. పాలించబడితున్న ప్రజలు   , ఎల్లప్పుడూ రాజు, పురోహితుల పట్ల విధేయులుగా ఉండాలంటే  దేవుడిని తేక తప్పలేదు. భూమి భగవంతుని సృస్టీ , రాజు భవంతుని ప్రతినిధి కనుక భూమి మొత్తం రాజుది. ఆ భూమిని దున్ని పంట పండిస్తున్న ప్రజలు రాజుకు పన్నుకట్టాలి అన్న నానుడి ఆరంభం  అయింది.  అంతేకాకుండా ఇక బొక్కసానికి సొమ్ము రావడానికి వివిధ మార్గాల అన్వేషణ ప్రారంభం అయింది. తమ రాజ్యం గుండా రవాణా అయ్యే సరుకులకు పణులు (వ్యాపారులు, వైశ్యులు) పన్ను చెల్లిస్తేనే తమ రాజ్యం గుండా వెళ్లడానికి అనుమతి ఇస్తామని ఇబ్బంది పెడుతారు. అంతే గాకుండా తన ఏలుబడి లో ఉన్న ప్రజలతోటి వ్యాపారం చేసి డబ్బుగడిస్తున్నావు ,నా రక్షణలో ఉన్న ప్రజలను దోచుకోవడానికి నీకు అనుమతి ఇస్తున్నాను కనుక నీ దోపిడి లో నా వాటా ఎంత ? ( వ్యాపారి చిన్న దోపిడి దారైతే, రాజు అందరినీ దోచుకొనే పెద్ద దోపిడి దారు)  అట్లా పన్నులు చెల్లించే వ్యాపారులు కొంతకాలానికి దారి దోపిడి దార్ల నుండి ఇబ్బందులు ఎదురైతున్నందున తమకు రక్షణ కావాలని కోరుతారు. అది వ్యాపారులకు రాజు చేస్తున్న సేవ, ఆ సేవకు రాజు విధించే సుంకం అట్లా , సేవలకు  పన్ను అయింది.  ఇబ్బడి ముబ్బడిగా ప్రజలనుండి, వ్యాపారులనుండి  పన్నులు వసూలు జెసిన  రాజులు, రాజకుటుంబాలు, సైన్యాధిపతులు, పురోహిత వర్గం  భోగ లాలసత్వమయమైన జీవితాలు గడిపేవి. శ్రమ జీవులైన ప్రజలు ఏ రాజైనా అదే చేస్తున్నాడు కనుక ఎవరుపరిపాలించినా మా బతుకులు ఇంతే అని ప్రజలు రాజుల యుధ్ధాలల్లో ఎన్నడూ భాగస్వాములు కాలేదు.  ప్రజల అశాంతి ని శాంతింప జేయడానికి , పూర్వజన్మ, కర్మ సిద్ధాంతాన్ని ప్రవేశ పెడుతాడు యాజ్ఞ వల్క మహా ముని. ప్రజల పైన పన్నులు, కర్మ సిధ్ద్ధాంతమ్ రెండూ కవల పిల్లలు.

ఈ పన్నుల పరంపర క్రీ.పూ.322 మౌర్య వంశం కు ముందు , గ్రీకుల  దండయాత్ర నుండి క్రీ.శ .11 శతాబ్దం మహ్మద్ గోరి దండయాత్ర వద్దనుండి క్రీ. శ. 16 వ శతాబ్దం బ్రిటిష్ పాలకుల ప్రవేశం నుండి 1947 దాకా ప్రజలతోటి సంబంధం లేకుండా రాజుల అవసరాల మేరకు, వారి  వారి విలాసాల కులాసాల మేరకు పన్నులు వేయడం ,గొల్లూడగొట్టి వసూళ్లు జేయడం జరిగింది.   
1950 లో భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చింది గదా? అందులో పేర్కొన్నట్లు గా సంపద అందరికీ సమానంగా,పంచేదానికి , ప్రజలందరి మధ్యన ప్రజాస్వామిక వాతావరణం ఉంచే దానికోసం ఏమైనా ప్రయత్నం జరుగుతున్నదా?   రాజరిక వ్యవస్తలో ఏదైతే ,  పన్నుల వసూళ్లు, దేశం లో ఉన్న సహజ సంపదలను వీలైనకాడికి అమ్ముకొని అనుభవించే పద్దతికి  , సంక్షేమ రాజ్యాలల్లో రాజ్యాంగం మేరకు అమలు కావాల్సిన రక్షణలు సామాన్య ప్రజలకు లభిస్తున్నాయా అన్నది చర్చనీయాంశం అవుతుంది గానీ జి‌ ఎస్ టి వలన ఏ సరుకులకు ఎంత పెరుగుతున్నది అన్నది సామాన్య ప్రజలకు సంబంధం లేనిది గా అయిపోయింది.  ఎట్లాగైనా ఎంతైనా వాళ్ళు పెంచుతారు , మనం చెల్లించాలి అనేదే ప్రజల అభిప్రాయం, రాచరిక వ్యవస్తలో వాళ్ళు యుధ్ధాలు చేసుకుంటారు, ఎవడు గెలిచినా దోచుకుంటాడు అనుకున్నట్లుగానే  సంక్షేమ రాజ్యాలని అనుకుంటున్న ఈ యుగం లో కూడా పాలించే వాడు ఎవడైనా పన్నులు వేస్తాడు, వాడు, వాణి అనుచరగణం .ప్రజల సొమ్ముతో రాజభోగాలు అనుభవిస్తారు.
నేను ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నాను చూడండి. G.O.Ms.No.38, Revenue (Endt.1) Dept, dt.29-1-2016.
Salary:Nill,special allowance: 8000, samptuary allowance: 7000, conveyance allowance:15000,if using own car:30000,rent free accomidation:50,000,car advance:10,000,00,computer :25000,crockery and cutlary:1,50,000  one time grant. Furniture :3,00,000. 1private secratary, one P.S.  one ps /pa out siders, attendars 3. Jamedar one , one driver, sweeprs 3.
ఇక ఆరోగ్యం, విదేశీ యాణం కమ్యూనికేషన్ అన్నీ ఫ్రీ. ఇవి కాకుండా దేశం లో ఉన్న సహజ వనరులు పెట్టుబడి దార్లకు అమ్ముకుంటే వచ్చే పర్సులు అవి వేరే. సహజ వనరుల విధ్వంసం వలన చచ్చేది సామాన్య ప్రజలు వచ్చేది మన రాజులకు కమిషన్లు.
సరుకుల పైన  సేవ పన్నులు వేయడం గాదు , ప్రజా సేవకులమ్ అని చెప్పుకుంటున్న వారు   ఆస్తులు కూడబెట్టుకోవడం మానేసి , ముందుగా విద్యా, వైద్యం సౌకర్యాలను ప్రివెట్ రంగం నుండి తొలగించి , సహజ వనరులను రక్షిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనండి . అప్పుడు మీరు ఏమి పన్నులు ఎందుకోసం ప్రజల పైన వేస్తున్నారో ప్రజలకు చెప్పండి. ప్రజలతో సంబంధం లేకుండా రాచరిక వ్యవస్తలో అధికార కాంక్ష కోసం యుధ్ధాలు జెసి ప్రజలను కస్టాల పాలు చేస్తే ఆ వ్యవస్తలు ఎందుకు మిగిలి లేవో చరిత్రను చదువండి.






No comments:

Post a Comment