Wednesday, December 25, 2019

కథలు ఎందుకు రాయాలే? ఎట్లా రాయాలే ?

తెలంగాణ రచయితల వేదిక వాళ్ళు ఈ రోజు కథా వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహిస్తే వెల్లుంటి. 
కథలు రాసే యువతరానికి చాలా సూచనలు , సలహాలు ఇచ్చారు సీనియర్ రచయితలు. చాలా మంచి ప్రయత్నం. ఈనాడు ఎవరిని చూసినా , ఏ డాక్తరో, ఇంజనీర్ ఓ, సివిల్ సర్వీసెస్ లోనో  ఉద్యోగం పొంది , బాగా డబ్బులు సంపాదించి ఆ డబ్బుల ద్వారా సేవలను కొనుక్కొని వాటి ద్వారా ఆనందం పొందండి అంటూ తలిదండ్రులు,కార్పొరేట్ విద్యాలయాలు పిల్లలకు, నేర్పిస్తున్నారు. ఈ క్రమం లో ఆ తలియదండ్రులు కూడా తమ జీవితాల్లో  అనేక ఆనందాలను కోల్పోతూ పిల్లలకోసమే , వారికి సంపాదించి పెట్టడం కోసమే జీవిస్తూ నత్త గుల్లల వలె జీవితాలను మోసుకొని తిరుగుతూ జీవిస్తున్నారు. పిల్లలను కూడా డబ్బులు సంపాదించి పెట్టె యంత్రాల వలె తయారు జేస్తున్నారు.దాని ద్వారా పిల్లలకు సామాజిక అవగాహన లేకుండా పోయి , తోటి వ్యక్తుల పైన బడి దౌర్జన్యంగా అయినా తమకు వాళ్ళ వద్ద నుండి  కావాల్సిందాన్ని వీళ్ళు లాగేసుకుంటున్నారు. అది ఒక రకంగా తమ హక్కు అని కూడా భావిస్తున్నారు. పౌర సమాజం ఒక శరీరం లాంటిది. శారీరానికి ఎక్కడ గాయమైనా శరీరం అంతా బాధ పడుతుంది. 

అందుకని పిల్లలకు మొదటి నుండి కన్న తలిదండ్రులు ,  తమతో బాటే పుట్టిపెరిగిన అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు, అమ్మమ్మ, , నాయనమ్మలు, తాతలు, ఇరుగు పొరుగు, వాడకట్టు, ఊరూ వాడా జనుల సహకారం తోనే నీవు పొందిన, లేదా పొందుతున్న ఏ జ్ఞానం అయినా ఏ సౌకర్యం అయినా సాధ్యం అయిందన్న విషయం వాళ్ళకు అర్థం చేయించాలి. అందుకు కథలు చాలా దోహద పడుతాయి. అందుకే పిల్లలు చిన్నప్పటి నుండి కథలు చెప్పుమని అడుగుతుంటారు. కానీ తలిదండ్రులు వారికి కథలు చెప్పే ఓపిక లేక, చెప్పగలిగిన పెద్దవాళ్లను ఇంట్లో ఉండనివ్వక వృద్ధాశ్రమాలకు పంపి, వీళ్ళు టీవీలకు గుడ్లప్పగిస్తే పిల్లలు సెల్ఫోన్లకు కల్లప్పగిస్తున్నారు. పిల్లలను బిజీగా ఉంచగలిగితే వాళ్ళు అసలు సెల్ఫోన్ జోలికి పోరుగాకపోరు. ఉపాధ్యాయులు గానీ తలిదండ్రులు గాని తలుచుకుంటే  అద్భుతమైన కథలను పిల్లలచేత రాయించ వచ్చు. ( నేను అలుగునూర్ హైస్కూల్లో ఉండగా మానేరు గొడపత్రిక ద్వారా పిల్లల రచనలు కొల్లలుగా రాయించాము). అయితే పిల్లలకు ముందుగా మనం కథలు చెప్పాలి. ఏ కథలు చెప్పాలి? పిల్లల స్తాయికి తగ్గ, వారు ఆర్థమ్ చేసుకోగలిగిన స్తాయి కథలు చెప్పాలి. అవి ఏవి అయినా పరస్పరం సహకార పద్దతిలో , ఆనందంగా కలిసి జీవించే విధమైన, అందులో కొంత హాస్యం పాలు, మరికొంత కుతూహలం తొంగి చూసే విధంగా ఉండాలి. కొన్ని కొన్ని పరుల కోసం పాటుబడే హీరో యిజం కథలు కూడా ఉండాలి. అందుకోసం మనం చెప్పే కథలు గాకుండా పిల్లల చేత తప్పకుండా వారానికి రెండు మూడైనా కథల పుస్త కాలు చదివించాలి. 

ఇక ఇక్కడ కతా వర్క్ షాప్ విషయానికి వస్తే , కథలు రాసే వాళ్ళు ఎందుకు కథలు రాయాలి? ఎలాంటి కథలు రాయాలి? అన్నప్పుడు, మనిషి సంఘ జీవి. తనకు తెలిసిన విషయాన్ని మరొకరితో పంచుకోవాలి అనేది మనిషి స్వభావం. అందుకని తనకు తెలిసినది అంతా పంచుకొనే పనిలో ఉంటే ఆ మనిషి ఇంకా మరే పని చేయలేడు. అయితే మరి ఏవి పంచుకోవాలి? ఆనందం తో కలిసి బతకడానికి , సహకారం తో కలిసి బతుకడానికి, పక్కవాళ్ళకు ఉపయోగం అయ్యే విషయాలను తెలుపడానికి మనకు తెలిసిన విషయాన్ని పంచుకోవాలి. ఎలా పంచుకుంటావు? అందరికీ నీవొక్కనివే చెప్పలేవుకదా? అందుకే రాతలు. , అవి కథలు, అవి కవితలు, అవి వ్యాసాలు, కతలైతే కుతూహలాన్ని కలిగిస్తాయి. చదివిస్తాయి.కనుక కథను ఏనూకున్నావు . సరే.  కథలు రాయడానికి మన వద్ద సమాచారం ఉండాలి. అందుకు పరిశీలనా జ్ఞానం కావాలి. ఎలా పరిశీలిస్తావు? అందుకు నీకోక దృక్పథం కావాలి. ఏమి దృక్పథం? కొందరికి భక్తి దృక్పథం. అది వారికి మాత్రమే ఆనందం ఇస్తుంది. కొందరికి భజన దృక్పథం అది వారికి మాత్రమే భుక్తిని ఇస్తుంది. కొందరికి వర్గ దృక్పథం. అది అశేష జనబాహుల్యానికి అన్నపానాదులను అందించడం మాత్రమే గాక సమ భావం తో సంతోషంగా కలిసి జెవించడం నేర్పిస్తుంది. మరి ఆ దృక్పథం అలవడాలంటే ఏమి చేయాలంటే, ఆదివరకే ఆ కోణం లో ఉన్న రచనలను చదువాలి. ఆ కోణం లో ఎవరెవరు రాశారో తెలుసు కోవాలి. పురాణ కాలం లో అయితే చార్వాకులు, లోకాయుతులు, ఆ తర్వాత మత రాజ్యాలు వచ్చిన తర్వాత వాటిని ప్రశ్నించిన భక్తి ఉద్యమ కారులు. భారత స్వాతంత్రోద్యమ కాలం నాటికి భగత్ సింగ్. ఆయనకు ఆ దారి చూపిన ప్రపంచ దేశాల వర్గ పోరాటాలు. వాటికి ఆలంబనగా నిలిచిన సిద్ధాంతాలు. హేతువాద దృక్పథం. హేతువాద కొనసాగింపుగా వచ్చిన అందరికీ అన్నీ సమానంగా దక్కాలి అన్న నినాదం.  ఈ బూమి పైన పుట్టిన మానవులంతా సమానమే. ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. ఎవరైనా మేము ఎక్కువ మాకు మీ కంటే కొంచెం ఎక్కువ దక్కాలే అని అంటే మాత్రం ఖచ్చితంగా అలా కోరిన వాళ్ళు మరొకరి అవకాశాన్ని దోచుకున్నట్టే. కనుక ఉత్పత్తి అయినది అంతా సమానంగా పంచవడాలే. అనే వాదన ముందుకు వచ్చింది. ఆ వాదనను కాదనే వాడు ఎవడైనా వాడు దోపిడీ దారే. ఈ వర్గ స్పృహ పొందడానికి వర్గపోరాటాల పైన వచ్చిన సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేయాలి అని చెప్పాలే. ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతున్నా బుక్ ఎక్సిబిషన్ ను పుస్తక ప్రియులు వినియోగించుకోవాలి . 

Sunday, December 1, 2019

ఆర్టీసీ సమ్మె - ఉద్యోగుల పై కెసిఆర్ వరాల జల్లు.

                        

ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె జేసినన్ని రోజులు వాళ్ళ పైన ఉరుములు పిడుగులు కురిపించిన వ్యక్తి అకస్మాత్తుగా ఇయ్యాల వరాల జల్లు ఎందుకు కురిపించి నట్టు? కొందరు 
టి‌ఆర్‌ఎస్ కార్యకర్తలు కీర్తిస్తున్నట్టుగా ఆయన కరుణామయుడు, చేతికి ఎముకలేని  అపర దానకర్ణుడేనా ? లేక ప్రజాస్వామిక ఆకాంక్షలకు విలువ ఇచ్చే ఉద్యమనేతనేనా ఆలోచిద్దాం. 

ఆర్‌టి‌సి ని రక్షించుకుందాం అన్న నినాదం తో, ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో బాటుగా వారి సర్వీస్ రూల్స్ కు , సౌకర్యాలకు సంబంధించిన మరికొన్ని డిమాండ్స్ తో ఆర్టీసీ ఉద్యోగ్గులు 4అక్టోబర్ నుండి సమ్మేలోకి దిగిన నాటినుండే సియెమ్ కెసిఆర్ నేరుగా రంగం లోకి దిగి సమ్మెను ఉక్కుపాదం తో అణగదొక్కే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆర్టీసీ ఎండి గాని, కార్మిక శాఖ అధికారులు గాని, ఆర్టీసీ మంత్రి గాని దశలవారిగా స్పందించాల్సి ఉండగా నేరుగా సియెమ్ ఎందుకు కలుగ జేసుకున్నట్టు అని ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా నిలిచిన మందకృష్ణ, కోదండరాం , బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నిస్తూనే ,  ఆర్టీసీ ఆస్తులపైన కన్నెసే సియెమ్ నేరుగా జోక్యం చేసుకున్నారు అని విమర్శలకు పూనుకున్నారు. ఖమ్మం లో శ్రీనివాసరెడ్డి ఆనే ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య కు పాల్పడేదాక ఆర్టీసీ మంత్రి, కొందరు బంగారు తెలంగాణ గ్రూప్ మంత్రులు ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ సమ్మెను వ్యతృరేకిస్తూ మీడియా ముందు మాట్లాడినా శ్రీనివాస రెడ్డి మరణం తర్వాత అంతా సైలెంట్ అయిపోయినారు. కానీ సమ్మె ఉదృతం అవుతున్న క్రమం లో స్వయంగా ముఖ్యమంత్రే గంటల తరబడి సమీక్షలు జరిపి,గడువు లోగా డ్యూటీ లో జైన కాకుంటే సెల్ఫ్ డిస్మిస్సే అన్నాడు. ఆయన మాటను ఆర్టీసీ ఉద్యోగులు ఖాతరు చేయకపోవడం తో ఆర్టీసీ ని ప్రైవేటీకరిస్తున్నా అని, ఆర్టీసీ మూసి వేత , సమ్మె ముగింపు రెండు ఏకకాలం లో జరుగుతాయి అని ఉద్యోగులను భయభ్రాంతులకు గురిజేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు అభద్రతా భావానికి గురి అయిన కొందరు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా , అలా ఎవ్వరూ చేయవద్దు నిలబడి కలబడుదాం అంటూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ , మరో వైపు ఆర్టీసీ నస్టాల కు కారణాలను , కారకులను గణాంకాలతో సహా ప్రజలముందు  బహిరంగ పరిచి ప్రజల మద్దతుకోసం చేతులు జోడించి , ప్రభుత్వ దాస్టీకాన్ని ప్రజలముందు బట్టబయలు చేస్తూనే , ఉద్యోగులు ఎంతమాత్రం బెదురకుండా తెలంగాణ ఉద్యమం లో చేసినట్లే ఆన్ని పోరాట పద్దతుల్లో మొక్కవోని ధైర్యం తో ఒక్కతాటి పైన నిలిచి పోరాటం చేసినారు. ఉద్యమ నాయకులు గా వ్యక్తులుగా , మంద కృష్ణ, కోదండరాం సమ్మె కు మద్దతుగా నిలబడినా, ఎంతో కొంత ప్రజామద్దతు కలిగిన కాంగ్రెస్, బిజెపి లు సమ్మెకు బయటనుండి మద్దతు గా నిలిచినారే గాని సమ్మేలో ప్రత్యక్షంగా వారి శ్రేణులను పాల్గొన జేసి సమ్మె ఉదృతానికి పూనుకోలేక పోయినారు. సమ్మె కారణంగా తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేక పవనాలను ప్రతిపక్ష పార్టీలు సొమ్ముజేసుకోలేక పోయాయి. సమ్మె సఫలమైతే అది మా పోరాట పటిమ ఫలితమే అందాం, సఫలం కాకపోతే ప్రభుత్వ నిరంకుశ వైఖరి అంటూ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుందాం అనుకున్నాయేగాని పరిస్తితిని తమకు అనుకూలంగా మార్చుకోలేక పోయాయి. కారణం ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేకపోవడం అయినా అయి ఉండవచ్చు, లేదా ప్రపంచ బ్యాంకుకు ప్రీతిపాత్రమైన ప్రైవేటీకరణకు బలమైన మద్దతుదారులు వీరే కావడం మూలాన కాగల కార్యాన్ని గంధర్వులే నెరవేర్చారు అన్న సామెత  అయినా ఐ ఉండవచ్చు. . 

ఇక సామాన్య ప్రజల వైపు నుండి ఆలోచిస్తే! దసరా పండుగ ముందు సమ్మె జేసుడు సరిగాదని ప్రజలు సమ్మె ప్రారంభం లో కొంత మంది  గొణిగినా ఆ తర్వాత తర్వాత సమ్మెకు ప్రజలనుండి మద్దతు లభించడానికి కారణం, ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగుల పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం,  డబ్బుల కోసం మిగిలిన ప్రభుత్వ సంస్తలవలే ప్రజలను వేధించిన సందర్భాలు లేవు, అవకాశం కూడా లేదు. అంటే ఎలాంటి అవినీతికి తావులేకుండా నిష్పక్షపాతంగా , వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా ప్రజలకు తమ సేవలను ప్రతిదినం కనీసం 8 గంటల పాటు అందజేస్తు,  నిత్యం ప్రజలతో కలిసి పనిజేస్తున్నతక్కువ వేతనం పొందుతున్న కస్టజీవులైన ఉద్యోగులు వీరే కావడం ఒక కారణం అయితే, చక్కని శిక్షణతో, క్రమశిక్షణ తో అతి తక్కువ ప్రమాదాలతో భద్రతాయుతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందజేస్తున్న ఏకైక సంస్త ఆర్టీసీ కావడం కూడా ప్రజల మద్దతు వీరికి లభించడానికి మరో కారణం.

ఒక వైపు సియెమ్ దఫా దఫాలుగా రోజులకొద్ది సమీక్షలు జరుపుతూ ఆర్టీసీ ని  మూసువేస్తున్నాం అని ప్రకటనలు చేయడం, మరోవైపు ఆత్మస్తైర్యమ్ కోల్పోయిన ఉద్యోగులు నాదే చివరిమారణం కావాలి అంటూ పిట్టల్లా రాలిపోతుంటే ,ఏకతాటి పై  ఎంత సంఘటితంగా ఉద్యమం సాగుతున్నా కూడా , మరికొందరి ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలి అంటే ఉద్యమాన్ని ఆపక తప్పని పరిస్తితిలో సమ్మెను విరమించి బేషరతుగా మేము డ్యూటీ లో చేరుతున్నాం అని కార్మికులు ముందుకు వచ్చారు. ఉద్యమం ఇక్కడే అసలైన మలుపు తీసుకుంది.31 మంది తమ సహచరులను కోల్పోయారు, మరో పది మందిని బస్సులు తొక్కి చంపివేసినాయి. లాఠీ చార్జీలతో వేలాది మంది గాయపడ్డారు. బేషరతు గా డ్యూటీలో చేరుతామ్ అంటే గూడా ఒప్పుకోకుండా తన్ని తరిమి వేస్తున్న ప్రభుత్వ వైఖరికి  అవమాన భారం తో అల్పజీవులైన ఉద్యోగులు అందునా ఆడ బిడ్డలు మీడియా ముందు లాఠీల గాయాలు చూపెడుతూ గోడు గొడున విలపించిన తీరు సామాన్య ప్రజల హృదయాలను కలిచి వేసింది. ఔరా! ప్రజలు ఇచ్చిన అధికారం ఆసరాతో ప్రజలపైన్నే ఇంత దాస్టీకమా ? ఇది రాచరిక వ్యవస్తా కూడా కాదే, ఇవాళ వారి వంతు అయింది కావచ్చు రేపు అది ఎవరి వంతు అయినా ఆశ్చర్యపడవలసిన పని లేదుకదా అంటూ ప్రజలు పెదవులు కొరుక్కోవడం ప్రభుత్వ వేగుల కంట పడక పోలేదు. అలాగే బహుశా ప్రభుత్వ శ్రేయోభి లాషులు ఎవరో సియెమ్ గారికి ప్రజల్లో రగులు తున్న కోపాగ్ని బడబానలం వలన ప్రభుత్వ ప్రతిస్ట కొంతైనా మసక బారే అవకాశం ఉందని నచ్చ చెప్పినట్టే ఉంది. లేకుంటే కోర్టు మందలింపులకు గాని, ప్రతిపక్షాల ఆడిపోసుకునుడుకు గానీ, 52 రోజుల సమ్మెకు గానీ, మొత్తంగా ఓ 40 మంది ప్రాణాలు పోయినా బెట్టు సడలని పట్టుదల, సామాన్య ప్రజలు పళ్ళు బిగించి కళ్ళు తెరువంగానే సట్టున చల్లారి ఇవ్వాళ సాయంత్రం వరాలు వర్షించింది అంటే అది ప్రజల విజయం గాక మరేమిటి? 

ఇక్కడ ఒక్క విషయం మాత్రం ఫ్యూడలిస్టిక్ అధికార ఆహాన్ని కొంత సంతృప్తి పరిచినట్లుగానే ఉంది. సియెమ్ తలుచుకుంటే ఎవరి అసంతృప్తి అయినా ఏమీ చేయదు, 

అది ప్రతిపక్షమైనా ,స్వపక్షమైనా .  ఎవరు ఏ సమ్మెలు చేసినా ఆయన అదరడు బెదరడు, ఆయన అలిగితే అవతలి వారి ఆశలు మలిగిపోతాయి , ఆయన కరుణిస్తే అవతలి వారి ఆశలు వెలిగిపోతాయి. ఆయన రాజు. దానకర్ణ మహారాజు. దండించనూ గలడు, దయచూపనూ గలడు. కనుక  బహుపరాక్ అంటూ ఒక హెచ్చరికను గూడా ఈ సందర్భంగా జారీ చేసినట్లు అయింది.  

Saturday, September 7, 2019

చంద్రయాన్ ప్రయోగాల మరో పార్షమ్.

                             చంద్రయాన్ ప్రయోగాల మరో పార్షమ్. 

ఈ రోజు మధ్యాహ్నం  చంద్రయాన్ పైన నేను పెట్టిన నా ఆలోచనలను సంపూర్ణంగా సమర్థించని కొందరు నా శ్రేయోభిలాషులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు, అవి ఏమిటంటే…
1). అభివృధ్ధి అనేది సమాంతరంగా జరుగాలి  , ఏ శాఖ పని అది చేసుక పోవాలి. . ఒక దాని కోసం మరొకదాన్ని ఆపివేస్తే అది సమగ్ర అభివృధ్ధి అనిపించుకోదు. 
2). రష్యా, అమెరికా , చైనా తర్వాత రోదసీ లో వియజయవంతమైన ప్రయోగాలు చేసిన ప్రపంచం లోని  4 వ దేశం గా మన దేశ శాస్త్రజ్ఞుల టాలెంట్ ను మనం గుర్తించాలి. 
3). ISRO ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రీయ దృక్పథాన్ని ఉటంకించ లేదు. 
4). దేశం యావత్తు isro కృషిని పొగడుతుంటే మీరు దాన్ని అంగీకరించక పోవడం సరిగాదు; 

పై నాలుగు అభ్యంతరాలను పరిశీలిద్దాం.
1). అభివృధ్ధి సమాంతరంగా జరుగాలి. 
 " దేశమంటే మట్టి గాదోయ్ - దేశమంటే మనుషులోయ్" , గురుజాడ అన్నప్పటికినీ  మనందరం గూడా ఆ మాట తో కొంత సయోధ్య కలిగే ఉన్నాము. భారత దేశం లో 58శాతం ప్రజలు ఇప్పటికినీ ఇంకా గ్రామాలల్లో వ్యవసాయం పైననే ఆధారపడి జీవిస్తున్నారు. అంటే 130 కోట్ల భారత ప్రజానీకం లో 75 కోట్ల మంది ప్రజలు ఆధార పడి జీవిస్తున్న రంగమైన వ్యవసాయాన్ని గాలికి వదిలేసి ఇప్పటికిప్పుడు భారత ప్రజలకు అత్యవసరం కానీ రోదసీ పరిశోధన కు అన్నేసి కోట్లు ఖర్చు చేయడం భావ్యమేనా? చేస్తే చేసిండ్రనే అనుకుందాం. వారి పరిశోధన వ్యవసాయం తో బాటుగా ఉష్ణమండలం అయిన భారత దేశం లో ప్రజలు ఇంత ఉక్కపోత వేడి తో సతమతమై పోతున్న క్రమం లో పర్యావరణానికి , పంటల దిగుబడి కి, దోహద పడేదిగా వాళ్ళ పరిశోధన  ఉండాలి. లేదా, ఉంటే ప్రజోపయోగకరం . కానీ మరింత పర్యావరణ హానికరమైన రేడియేషన్ కు కారణమయ్యే రేడియో విద్యుత్ తరంగాలను ఉత్పత్తి జేసె ఉపగ్రహాల చెత్తకుప్పలను రోదసీ లో ఇబ్బడి ముబ్బడి గా ప్రవేశ పెడుతూ మల్టీనేషనల్ కంపనీలకు లాభాల పంటలు పండించే టెక్నాలజీ సృస్టించి , సామాన్య ప్రజానీకాన్ని ఉత్పత్తి క్రమం నుండి దూరం జేస్తున్న ఎంటర్టైన్ మెంట్ జాడ్యాన్ని ప్రజలకు అంటగడుతుంటే పాలకవర్గాలు భళా భళా అని కీర్తిస్తుంటే ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా అధికార పక్షానికి అంటకాగుతుంటే , దాని అభివృధ్ధి ఫలాలు సామాన్య ప్రజానీకానికి అందుబాటులో లేక పోవడం, ఉన్నా విషతుల్యమే అయితే దాన్ని సరైన దిశలో పెట్టే ప్రశ్నించే విధానం అవసరమే అని నా అభిప్రాయం.  
2). ప్రపంచ 4 వ దేశం గా టాలెంట్ ను గుర్తించడం . 
మన శాస్త్రజ్ఞులు చేస్తున్న ప్రయోగాలల్లో వారు ఉపయోగిస్తున్న సరంజామా సింహా భాగం విదేశాల నుండి దిగుమతి చేసుకున్నదే. స్వదేశీ సరంజామా, సాంకేతికత మనం ఇంకా అభివృధ్ధి చేసుకొని మన స్వంత టెక్నాలజీ పైన ఆధార పడి ప్రయోగాలు  చేస్తే తప్పకుండా మనం వారిని అభినందించ వలసిందే. అలాగే రోదసీ లో ప్రయోగాలు ఎందుకు చేయాలి? అంటే మన భూమి తో బాటు గా ఉనికి లోనికి వచ్చిన తక్కిన గ్రహాలు ఏ స్తితి లో ఉన్నాయి? అక్కడ మానవ మనుగడకు అవసరం అయిన గాలి, నీరు, వాతావరణం ఉన్నాయా? ఉంటే మానవ కళ్యాణం కోసం వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు? ప్రపంచానికి ఇదిగో ఇది మన కాంట్రీ బ్యూషన్  అని చెప్పగలిగే స్తితి లో ఉండాలి. కానీ జరుగుతున్నది ఏమిటి? సాధించినది ఏదైనా ఉంటే అది మా ఘనతే అని రాజకీయ నాయకులు మార్కెటింగ్ జేసుకోవడానికే ఉపయోగించుకొంటున్నారు. ఒకవైపు భూమి పుట్టు పూర్వాల పైన ఇస్రో ద్వారా పరిశోధన అంటారు,మరోవైపు మాది సనాతన ధర్మం, ఈ చరాచర సృస్టికి మూలం భగవంతుడే తప్ప ఏ సైన్స్ గాదని మొండిగా వాదిస్తారు. ఈ ద్వైదీ భావం తో ఎవరిని మోసం చేయడానికి ఈ పరిశోధనలు అని ప్రశ్నించవలసిన అవసరం లేదా?
3). ISRO శాస్స్త్రీయతను ఉటంకించడం ....

నిజమే ఇస్రో కు ఉన్న శాస్త్రీయత ఏమిటి అన్నది కూడా పెద్ద ప్రశ్నే. ఇస్రో శాస్త్రజ్ఞులు రాకెట్ , రాకెట్ లాంచర్, చంద్రయాన్ మిషన్ రూపొందించి దానిని ప్రయోగించే ముందు మన తిరుపతి వెంకన్న పాదాల వద్ద పెట్టి అర్చనా చేయించి ప్రయోగం విజయవంతం కావాలని కొబ్బరికాయ కొట్టి దేవునికి నైవేద్యం సమర్పించి , ఆ ప్రాజెక్ట్ రూపకర్త , సృస్టి కర్త అంతా దేవుడే అతని దయయే   అని ప్రార్థించి వస్తారు. అక్కడ ఇంకా మన శాస్త్రజ్ఞుల విజ్ఞానం ఏముంది, అంతా దేవుని దయ యే కదా? దేవుని దయ ఉంటే అది విజయవంతం అవుతుంది లేకుంటే కాదు. మరీ ముఖ్యంగా దేవుడు ముందే నిర్ణయించిన ప్రకారం అది విజయవంతం కావాలని రాసి పెడితే విజయవంతం అవుతుంది. లేకుంటే లేదు. అంతే కదా? సైన్స్ ప్రకారం పదార్థం ప్రధానం అంటుంటే , ఆస్తిక వాదులు భావం ప్రధానం అంటారు. మనం ఒకవైపు పదార్థ పరిణామ క్రమాన్ని పరిశోధించే ప్రయోగానికి పూనుకుంటూ , పదార్థం ప్రధానం కాదు, మనం ఉంది అనుకుంటే ఉంటది, లేదు అనుకుంటే ఉండదు అన్న సిద్ధాంతాన్ని బోధించే భగవంతుని దయ అనే సిద్ధాంత  విధానం ఎలా శాస్త్రీయం అవుతుంది అన్నది కూడా నా ప్రశ్న. 
4). ISRO కృషిని పొగడక పోవడం. 

ఇప్పుడు పరిస్తితి ఎలా ఉందంటే, మన ప్రధాని ఇస్రో శాస్త్రజ్ఞుల తో 20 నిమిషాల పాటు ప్రసంగించిన తన ప్రసంగ ప్రారంభం లోనే " భారత్ మాతా కి జై " అన్నారు. ఆయన అలా అన్నప్పుడు ఎవరైనా అలా అనకపోతే అతడు దేశ భక్తుడు కాదు అన్న అభిప్రాయం ప్రోవోక్ చేయబడింది. కనుక ఇపుడు ప్రతిపక్షం , పత్రికలు అన్నీ కూడా " నమహోమ్" అంటున్నాయి. మొన్నటికి మొన్న 370 ఆర్టికల్ రద్దును సమర్థించని కాంగ్రెస్ పార్టీ ని ఏమని అన్నారో విన్నాం . కనుక అందరూ ఇప్పుడు మోడీ దేన్ని సమర్థిస్తే అందరూ దాన్నే సమర్థించే , దేన్ని వ్యతిరేకిస్తే దాన్ని వ్యతిరేకించే ఒక పరాధీన పరిస్తితి లో ఉన్నారు. అయినా 130 కోట్ల భారత ప్రజలల్లో రోజూ పత్రికలు చదివే వారు 10 శాతం కూడా ఉంటారో ఉందరో నాకు అనుమానమే. అలాంటి వాళ్ళకు మాత్రమే చంద్రయాన్ వైఫల్యమో, సాఫల్యమో కొంత తెలుసు. వాళ్ళంతా నోరుండి మాట్లాడజాలని అవసరార్త్తులో అనుచరగణాలో అయి ఉంటారు. కనుక వాళ్ళు ప్రామాణికం కాదు అన్నది నా ఉద్దేశం. పైగా 978 కోట్ల రూపాయల ప్రజా ధనం కొన్ని వేల పనిగంటలు వృథా అయిపాయే గదా? మన శాస్త్రజ్ఞులు దేవుని పైన భారం వేయకుండా తమ సామర్థ్యం పైన నమ్మకం ఉంచి మరింత సైంటిఫిక్ గా ఆలోచించి , మరింత సామర్థ్యం తో  పని చేసి ఉంటే నిజంగానే ఆ ప్రయోగం సక్సెస్ అయ్యేది కదా అన్నది నా బాధ. సరే అది ఎంత సక్సెస్ అయినా మెజారిటీ ప్రజల ప్రయోజనాలను ఎంతో కొంత నెరవేర్చెదిగా ఉన్నప్పుడే దానికి సార్థకత . లేదంటే ప్రజలను మరికొంత కాలం మభ్యపెట్టడానికి పాలక వర్గాల చేతిలోని పనిముట్టుగానే ఈ ప్రయోగాలన్నీ మిగిలి పోతాయి.                                                    

చంద్రయాన్ లు ఎవరికోసం ,ఎందుకోసం?

                   చంద్రయాన్ 2 ప్రయోగం ఎవరి కోసం ఎందుకోసం ? 

1969 జులై 20 నాడు అపోలో 11 స్పేస్ ఫ్లైట్ ను అమెరికా రోదసి లోకి ప్రవేశ పెట్టింది. దానికి నాయకత్వం వహించిన నీలార్మ్స్త్రాంగ్ చంద్రుని పైన కాలు మోపి 21.5 కిలోల చంద్ర శిలలు భూమి పైకి తీసుకొని తెచ్చిండు. ఇది చరిత్ర.  అమెరికా లోని టెక్సాస్ స్టేట్ హ్యూస్టన్ నగరం లోని లండన్ బి జాన్సన్ నాసా కేంద్రం లో ప్రదర్శనకు పెట్టిన ఆ చంద్ర శిలలను, నేను 2014 లో ముట్టుకొని చూసి నపుడు, నాకు ఒక అనుమానం వచ్చింది.అప్పటికే అక్కడ మానవ నివాసం సాధ్య పడదని తెలిసినా కూడా  ఎందుకు ఇంత వ్యయ ప్రయాసకు ఓర్చి చంద్రుని పైకి వెళ్ళి ఈ శిలలు సేకరించుక వచ్చారన్నది నా అనుమానం. దానికోసం చరిత్రలోకి కొంచం తొంగి చూద్దాం. 

పరుల సొమ్ము, ఆస్తిపాస్తుల  ఆక్రమణ , వారి పైన ఆధిపత్యం  కోసం యుధ్ధం అవసరం. యుద్ధం కోసం ఆయుధాలు అవసరం. రాతి గొడ్డన్లు, గదలు, విల్లు అమ్ములు, మందుగుండు, తుపాకులు, డైనమేట్స్,   ICBMS అంటే ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిస్సైల్స్ , వాటిని మోసక వెళ్లడానికి యుధ్ధవిమానాలు, రాకెట్లు అవసరం అయినాయి.ఇదీ ఆయుధాల క్రమమ్ నుండి ఎదిగివచ్చిన ఒక పరంపర. 1930 లోనే జర్మనీ దేశం మల్టీ స్టేజెడ్ రాకెట్స్ ను కలిగి ఉంది. అంటే సెప్టెంబర్ 1945 రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసే సరికి ఆ దేశం రోదసి శాస్త్రం లో ఆ 15 ఏండ్ల కాలం లో ఎంత పురోభివృధ్ధి సాధించిందో మన అర్థం చేసుకో వచ్చు. అలా అభివృధ్ధి చెందిన సాంకేతికతను రెండవ ప్రపంచ యుధ్ధం తర్వాత ఒక వైపు అమెరికా మరో వైపు రష్యా చేజిక్కించుకుంది. ఆపరేషన్ పేపర్ క్లిప్ పేరుతో అమెరికా రాకెట్ టెక్నాలజీ ని రహస్యంగా తరలించుకు పోయింది. అందులో 1,600 మంది సైంటిస్టులు, ఇంజనీర్లు ఉండగా 100v 2 రాకెట్ ఆపరేషన్ రహస్య పత్రాలు ఉన్నాయి. మిట్టెల్ వర్క్ సైట్ నుండి రష్యా v2 బలాస్టిక్ మిసైల్స్, v1 ఫ్లయింగ్ బాంబ్స్ తయారీ టెక్నాలజీ తీసుకు వెళ్లింది. ఆ రెండు దేశాలు జర్మనీ నుండి తస్కరించుకొని తెచ్చుకున్న టెక్నాలజీ ని అభివృధ్ధి పరుచుకొని తమ అవసరాలకోసం వాడుకొనే క్రమం ప్రారంభం అయింది.  

1945 తర్వాత నుండి 1991 USSR అంతరించేదాకా ఆ రెండు,( అమెరిక రష్య)  పవర్ గ్రూప్ ల ఆధిపత్య పోట్లాటను చరిత్రలో అందరం చదువుకున్నాం. అయితే యుధ్ధ తంత్రాల రచనలో మేము ఆధిపత్యం లో ఉన్నాం అంటే మేము ఉన్నాము అని ప్రపంచానికి తెలియ జేసె కొరకు అమెరికా రష్యాలు పడ్డ పోటీలో వాటికి  రోదసి లోకి వెళ్ళడం ఒక పెద్ద ఛాలెంజ్ అయింది. ఆ క్రమం లో నవంబర్ 3, 1957 లో మాస్కో లోని వీధి కుక్క లైకా ను రష్యా రోదసిలోకి పంపింది. 1959 లో లునా 1, 1961 యూరీ గగారిన్,ఆ తర్వాత ఘోర్మాణ్ టైటాన్, వాలెంటీనా వ్లాడిమీరొవ్ణ ను రోదసి లోకి పంపింది. 1963 లో రష్యా స్టేట్ డ్యూమా సభ్యురాలు భూమి చుట్టూ రోదసి లో 48 సార్లు , దాదాపు మూడు రోజులు రోదసి లో గడిపింది. 1964 లో వాస్కోల్ 1 అని ఒకరికంటే ఎక్కువ మందిని రోదసిలోకి మోసుకు పొగలిగిన వ్యోమ నౌకను, లియోనోవా అనే ఒక స్పేస్ వాక్ ను రష్యా వారు ప్రయోగించారు. మధ్య యుగాలల్లో దక్షిణ భారత దేశం లో చోళులు , పాండ్యుల పరిపాలన కాలం లో ఒకరికంటే ఒకరం గొప్పవాళ్లం అని నిరూపించుకోవడానికి ఆలయాలు కట్టినట్లు చరిత్ర.    అలా వచ్చిందే భారత దేశానికి శిల్పకళా వారసత్వ సంపద అయిన బృహదాలయం. అదే విధంగా 1968 లోనే అమెరికా రోదసి క్యాప్టెన్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపైకి పంపి మీరు కుక్కలను పి‌ఐ‌ఎల్లులను పంపితే మేము ఏకంగా మనుషులనే పంపగలుగుతాము చూడండి అని ప్రపంచానికి ఛాటి చెప్పింది. ఆయన చంద్రుని పైన కాలు మోపి చంద్ర శిలలు తెచ్చి ప్రపంచానికి 50 సంవస్తారాలకిందనే చూపిండు. ఇదంతా వాళ్ళు పనిలేక గాదు, ఒకరికంటే ఒకరం యుధ్ధ నైపుణ్యం కలిగిన వారం తస్మాత్ జాగ్రత్త మా జోలికి వస్తే అని ప్రపంచానికి ఛాటి చెప్పడానికే అలా చేశారు. విచిత్రం ఏమిటంటే 21 జులై 1987 లో వారిద్దరు కలిసి కూడా అపోలో సోయేజ్ మిషన్ ను కూడా ప్రయోగించారు. రష్యా శిబిరం కుప్పకూలి పోయిన తర్వాత ఏక ధృవ ప్రపంచం అయిన అమెరికా కు ఇక ఆ అవసరం తీరిపోయింది.  

ఇప్పుడు మనం చంద్రుని పైకి ఒక చంద్రయాన్ 2 ప్రయోగించి పెద్ద ఆగమ్ ఆగమ్ చేస్తున్నము.22 జులై న ,  దాన్ని ప్రయోగించేనాడు పాఠశాలలల్లో పంతుళ్ళు చదువులు చెప్పడం మానేసి పిల్లలతో టీవి లముందు ఆ అపురూప దృశ్యాలను తిలకిస్తూ కూచున్న విషయం చూసినమ్, మీడియా సైతం నభూతో నభవిష్యత్ అంటూ ఎంతగా డబ్బాలు వాయించినాయంటే ఆ గ్లోబెల్ గాన్ని మించి పోయినయ్. సరే దీనితో మన దేశానికి ఒరిగే ప్రయోజనం ఏందో నాకైతే సమజ్ అయితలేదు. రోదసి లోకి పంపే ఆ వస్తువులు అన్నీ మనం బయటి దేశాలనుండి కొనుగోలు జేసి తెస్తున్నవే. ఇంతవరదాకా మనం ప్రయోగించిన ఉపగ్రహాల ద్వారా సమకూరిన ప్రయోజనం ఏమంటే జియో కంపనీ కి ఆ టెక్నాలజీ అతి చౌకగా అమ్మి ప్రజలకు తక్కువ దర లో  నెట్ సౌకర్యం కలుగ జేయడం. కాదంటే కొన్ని పేద దేశాలకు మన ఉపగ్రహాల ద్వారా సేవలు అందించే మార్కెట్ ను చేజిక్కించుకోవడం. కొండంత రాగం దీసి ఏదో పాటబాడినట్టు ఉన్నది సంగతి. ఇప్పుడు భూకేంద్రం తో లింక్ తెగిపోయిన తర్వాత లక్షలల్లో వేతనం , ఏసీ గదులల్లో నివాసం ఉంటూ , కంప్యూటర్ల ముందు కూర్చొని 130 కోట్ల మంది భారత ప్రజలకు వాళ్ళు చేస్తున్న పని ఏమి ఉపాధి కలిపిస్తుందో, ఏ నాగరికత నేర్పింస్తుందో తెలియదు గాని ఆ శాస్త్రజ్ఞులు వారి ప్రాణాలు ప్రాణమొడ్డి నారని ప్రధాని ప్రశంసిస్తుంటే , ఒక వైపు రైతులు , నేత కార్మికులు , పతి రోజు వందల సంఖ్యలో చనిపోతుంటే వాళ్ళ ప్రాణాల గురించి ఒక్క నాడు ఎంపతి చూపని మన నాఊయకులు , చంద్రయాన్ ఆగిపోతే అంత స్పందనా? ఏమి మన రైతులు, ప్రాణాలు పోతున్నాయి గదా ?  అలాగే నల్లమలలో పర్యావరణాన్ని ఎంతో కొంత మెరకైనా కాపాడుతున్న అడవులను , గుట్టలను తవ్వుమని ప్రజా పయోజన వ్యతిరేకమైన సిఫారసుజేసిన ఆ అణుశాస్త్రజ్ఞుల బాధ్యతా రాహిత్యం మన పాలకులకు గొప్ప హితంగా కనిపిస్తున్నది . 

2008 లో యుపియే ప్రధాని మన్మోహన్ సింగ్ హయాం లో 390 కోట్లతో చంద్రయాన్ 1 , ఇప్పుడు 978 కోట్ల రూపాయలు పెట్టి చంద్రయాన్ 2 ప్రయోగాలు అన్నీ కూడా భారత ప్రజలు ఎదురుకుంటున్న మౌలిక సమస్యలను పక్కదారి పట్టించడానికి చేస్తున్న ఒక భూస్వామ్య,పితృస్వామిక లక్షణాలైన పరువు ప్రతిస్టా అనే ఒక పనికి రాని వ్యవహారమే దప్ప మరోటి గాదు. 

రైతులు ఎరువులు లభించక , అతివృస్టి, అనావృస్టి , వలన బాధపడుతూ పంటలు పండిస్తే దానికి గిట్టుబాటు దరలు లేక రైతు ఆత్మహత్యలు నిత్యకృత్యం అయిపోతున్న చోట,సీజనల్ వ్యాధులను అరికట్టలేక నిత్యం ప్రజలు వేల సంఖ్యలో ఆసుపత్రుల ముందు బారులు  కట్టిన అనారోగ్యం ఒకవైపు, చదువుల సంగతిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పగించి చేతులు దులుపుకున్న ఈ పాలక వర్గాలు, నేల పైన ప్రజల సమస్యలను వదిలేసి ఆకాశం వైపు చూపడం హాస్యాస్పదం.

గుజరాత్ లో సోమనాథ్ దేవాలయం నుండి తమిళనాడులో బృహదాలయం మధ్యలో మన తిరుపతి వేంకటేశ్వర స్వామి లాంటి అతి గొప్ప గొప్ప ఆలయాలు ఉండగా మనకేమి తక్కువ అంటూ 1800 కోట్లతో యాదగిరి గుడి కట్టిన చందమే , మన చంద్రయాన్లు. మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె అన్న చందం ఉంది మన పాలకుల పాలన.  

Wednesday, September 5, 2018

చరిత్ర అధ్యయనం యొక్క ఆవశ్యకత.

                                    

ఈ రోజు ఉదయం ఆస్ట్రేలియా నుండి ;మా సుబ్బా  రావ్ సార్ చిన్న కొడుకు సుజిత్ బిల్లా మాకు పంపిన టీచర్స్ డే గ్రీటింగ్ మెసేజ్ విన్న తర్వాత నా అవహానన కొంత మిత్రులతో షేర్ చేసుకోవాలనిపించింది. మాహానుభావుడు మా ఆకుల  భూమయ్య సార్ ఉండంగా ఏ విషయం లో అయినా సరే ఏదైనా సందేహం వస్తే ఫోన్ లో అయినా మాకు విషయం అర్థం చేయించడానికి ఎంత సేపైనా మాట్లాడి విషయాన్ని కూలంకషంగా చర్చ చేసే వాడు. కానీ ఆయన తర్వాత అంతటి అవగాహన ఉన్న వ్యక్తి మాకు మరొకరు పరిచయం లేకుండా పోయారు.


మనుషుల జీవన విధానానికి, వనరుల వినియోగానికి, శ్రమయుక్తమైన ఉత్పత్తి నుండి సులభతర ఉత్పత్తికి మారే క్రమం లో అభివృధ్ధి అయిన సాంకేతికత, విద్య,  అందులో మనుషుల నాగరికతలు, సంస్కృతులు, చరిత్రతో ముడిపడి యున్న క్రమానుగత సంబంధం గురించి నాకున్న అవగాహన మేరకు కొంత మాట్లాడుకుందాం.


నాగరికతలు అంటే మనుషులు నగరాలను నిర్మించుకొని జీవించే విధానం. ఒక నాగరికత గుంరించి మాట్లాడుకోవాలంటే దాని భౌగోళికత, అది మనుగడలో ఉన్న కాలం, ఉపయోగించిన భాష, లిపి, సైన్స్ ఆండ్ టెక్నాలజీ అంటే గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, కొత్త కొత్త పనిముట్లను ఆవిష్కరించుకోవడం.మతము, ఫిలాసఫీ, సంస్కృతి అంటే పండుగలు, సంగీత సాహిత్యాలు, ఆటపాటలు, కుటుంబ జీవన విధానం, కర్మకాండలు, ఇవ్వన్ని నిర్వహించుకోవడానికి ఉత్పత్తి, (వ్యవసాయం, పశుపోషణ) , మారకం, అధికారం, అంటే రాజు, లేదా గణ పతి, లేదా కుటుంబ యజమాని. తగవులు కొట్లాటాలు, యుధ్ధాలు, వాటి నియమ  నిబంధనలు అంటే చట్టాలు అన్న మాట.


క్రీ.పూ. 10,500 నుండి క్రీ. పూ. 4500-2000 కాలం దాకా నియో లిథిక్.(కొత్త రాతి యుగం)  ఏరా అంటారు.ఈ కాలం లోనే వ్యవసాయం ప్రారంభం అయింది. క్రీ. పూ. 2900 నుండి క్రీ. పూ. 1150 వరకు కంచు యుగం, క్రీ.పూ. 1100 నుండి ఇనుప యుగం ప్రారంభం అయింది. అంటే కొత్తరాతి యుగం అంతరించిపోయి ఒకే సారి కంచుయుగం వచ్చినట్టు కాదు.ఎందుకంటే ఇప్పటికీ మనం పప్పు రుబ్బుకోవడానికి రాతి పోత్రాన్ని వాడుతున్నాం, ఒక క్రమానుగతంగా పాత పనిముట్ల స్తానమ్ లో ఆధునికమైన పనిముట్లు వస్తాయన్నా మాట. ఇప్పటికీ అదే విధానం అమలవుతున్న విషయం మనం గమనించవచ్చు.


క్రీ.పూ. 4500 నుండి ఈజిప్ట్ లో సుమేరియన్ నాగరికత వెళ్లివిరింది. ప్రజలు ఆకాడియన్ భాష మాట్లాడే వారు, క్రీ పూ.2300 కాలం లో వారికి ఒక రాజు ఉండేవాడు. అతని పేరు ఆకాడియన్ రాజు. మనం చరిత్రలో చదువుతున్న అనేక రాజ్యాల పాలన వలెనే సుమేరియన్ నాగరికత కాలం లో రాచరిక వ్యవస్త పాలన నడిచింది. ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కర్మ కాండలో ఈజిప్ట్ మమ్మీల ను గమనిస్తాము. అంటే అప్పటికే మనిషి చనిపోతే మళ్ళీ పుడుతాదన్న విశ్వాసం ఉన్నట్లు తెలుస్తున్నది.


క్రీ. పూ. 3100 కాలం లో టైగ్రిస్ , ఇఫ్రాటస్ నదుల మధ్యగల సారవంతమైన  భూభాగాన్ని ఈ రెండు నదుల నీళ్ళు సస్యశ్యామలం చేయడం వలన ఇక్కడ్ మెసపుటోమియా నాగరికత విలసిల్లింది. ప్రస్తుతం ఉన్న ఇరాక్, ఇరాన్ బార్డర్, సౌదీ అరేబియా, టర్కీ, సిరియా భూభాగం నాటి ప్రాచీన మెసపుటోమియా నాగరికత విలసిల్లిన నేల. ఇక్కడ ఆకాడియన్ భాష మాటల్ల్దేవారని, దానికి లిపి లిటరేచర్ కూడా ఉండేదని వికె పీడియా వారి సమాచారం.


క్రీ. పూ. 3300 నుండి 1300 వరకు సింధు, జీలం, చీనాబ్, రాబి, బియాస్, సట్లెజ్ అను ఆరు నదుల పరీవాహక ప్రాంతం లో సింధు నాగరికత వెళ్ళి విరిసినట్లు 1920 లో బ్రిటిష్ ప్రభ్త్వమ్ వారు జరిపించిన తవ్వకాల్లో మన ములవాసుల , మన పూర్వీకుల ఆనవాళ్ళు లభించినాయి.


క్రీ.పూ. 2003 నుండి క్రీ. పూ. 539 మధ్యలో బాబిలోనియన్ నాగరికత ఇరాక్ లో ఉండేది. ఆకడియన్స్, అమరోటియన్స్,బాబిలోనియన్స్ వలసల వలన ఈ బాబిలోనియన్ నాగరికత ఏర్పడింది.


క్రీ.పూ. 1200 నుండి క్రీ. పూ. 600 వరకు సింధు నాగరికత స్థానం లో ఆర్యులు తెచ్చిన వేదిక్ ఏరా వచ్చింది. ఈ కాలం లో రాజులు , పురోహితులు,యజ్ఞయాగాదులు, క్రతువులు నిర్వహించిన ఫలితంగా వ్యవాసాయానికి పనికి వచ్చే పశువులను బలులు ఇచ్చినట్లు వాఋ రాసుకున్న వేదాల వలన తెలుస్తున్నది.


క్రీ.పూ 600 నుండి క్రీ. ష. 1 వ శతాబ్దం వరకు భారత దేశం లో జీవహింస కు వ్యతిరేకంగా బౌధ్ధ మతం ప్రజల జీవన విధానం అయింది. ఈ కాలం నుండే భారత దేశం లో బౌధ్ధ మత వ్యాప్తి కోసం మొట్టమొదటి సారిగా శాశ్వత నిర్మాణాలైన ఆరామాలు నిర్మించబడ్డాయి.


క్రీ. ష. 1 వ శతాబ్దం తర్వాత బౌధ్ధ మతావలంబుడైన అశోక చక్రవర్తి మునిమనుమడు బృహద్రతుణ్ణి అతని సర్వ సైన్యాధ్యక్షుడైన మెసపటోమియా నాగరికతకు చెందిన ఆర్య వంశజు రాలైన వనితా పుత్రుడైన పుష్యమిత్ర సంఘుడు సంహరించి హిందూ మతాన్ని స్టాపించినాడు.


క్రీ. పూ. 1200 శతాబ్దం లో యూరప్ ఖండం లో మైనో యాన్ , మైసినియాన్ నాగరికతలు వచ్చినాయి.


రాచరిక వ్యవస్తాలో పాలకుల వలన బాధలు పడిన సామాన్య ప్రజలు అనేక తిరుగుబాట్లు చేసి చనిపోయి తమ రక్తాన్ని ఎరులై పారించి నారు. ఈ క్రమం లో ఇంగ్లాండు లో ఒకటవ, రెండవ సివిల్ వార్స్ తర్వాత 1649 లో ఆలివర్ క్రామ్ వెల్ అను అతి సామాన్యుని నాయకత్వం లో ఇంగ్లాండ్ చక్రవర్తి చార్లెస్ 1 ను చంపివేసి ఈ భూమి పైన మొట్టమొదటి సారిగా రాచరిక వ్యవస్తా స్తానమ్ లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్తా ఆవిర్భవించింది.


క్రీ పూ. 10500 లోని నియో లిథిక్ కాలం అంటే కొత్తరాతి యుగం  కాలం తర్వాత వచ్చిన సింధు నాగరికత అంటే క్రీ.పూ 3300 కాలం నుండి 1947 లేదా 1952 సార్వత్రిక ఎన్నికల దాకా అంటే 5250  సంవస్తారాల కాలం పాటు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ భారత దేశం లో రాచరిక పాలనయే నడిచింది. సింధు నాగరికత కాలం నాటికి ఈ దేశం లో కుల ప్రస్తావన లేకుండే అని. వైదిక కాలం లో కూడా లేకుండే అని ఒకరు, లేదు నారద  , పరాశర స్మృతుల కాలం లోనే శిక్షా స్మృతులల్లో శూద్రుల ప్రస్తావన ఉందని ఒకరు అంటున్నారు. కాకుంటే క్రీ. శ. ఒకటవ శతాబ్దం తర్వాత నుండి క్రీ. ష. 5 వ శతాబ్దం లోని గుప్తుల కాలం నాటి కైతే మను స్మృతి స్తిరపడి శూద్ర కుల వ్య్వస్త బలపడి ప్రతి క్లులానికి ఒక పని అప్పగించబడి ఆ కులం వాళ్ళు ఆ పని చేయవల్సిందే , చేయనంటే ధర్మం తప్పిన వారీగా కుల భ్రస్తులు గా శిక్షించ బడే శిక్షా స్మృతి ఏర్పడింది. సరే ఈ కుల వ్యవస్తా ద్వారా ఎంత అవస్తాలు అవమానాలు జరిగినాయో ఇక్కడ చర్చనీయ అంశం కాదు.


ప్రపంచ వ్యాప్తంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని సంపద కూడబెట్టిన యూరప్ ఖండం లోని ఇంగ్లాండ్. జర్మనీ , ఫ్రాన్స్ , ఇటలీ. లాంటి దేశాలు ప్రపంచవ్యాప్తంగా  వనరులు కలిగియున్న దేశాలనుండి కొల్లగొట్టిన సంపదలను పారిశ్రామిక ఉత్పత్తులు గా మార్చి మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకని 1760 నుండి -1820- 1840 దాకా పారిశ్రామిక విప్లవం వచ్చింది. పారిశ్రామిక విప్లవం ఫలితంగా అధికమైన  ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెట్ కావాల్సి వచ్చింది. ఆ మార్కెట్ ను పంచుకొనే క్రమం లో వచ్చిన తగాదాల ఫలితంగా 1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచ యుధ్ధం , 1939 నుండి 1945 వరకు రెండవ ప్రపంచ యుధ్ధాలు వచ్చినాయి.


సామాన్య ప్రజలనుండి పన్నుల రూపం లో జమచేసిన సంపద ఒకవైపు, ఆ సంపదతో పెంచిపోషించుకుంటున్న రిసర్వ్ సైనిక బలగాల బలం మరో వైపు సంతరించుకున్న సంపన్న రాజ్యాలు ప్రపంచదేశాలను తమ కాలనీలుగా మార్చుకొనే క్రమం ప్రారంభమైంది. అంటే సంపద్వంతమైన, సైనిక బలవంతమైన సామ్రాజ్యాలకు వలసరాజ్యాల అవసరం పడ్డది.అట్లా ప్రపంచదేశాలను తమ వలసలుగా మార్చుకున్న తర్వాత దోచుకున్న వనరులతో పరిశ్రమలు స్తాపించి వస్తూత్పత్తి చేయడానికి పెట్టుబడి అవసరమైంది. ఈ పెట్టుబడి ఇండస్ట్రియల్ క్యాప్టలిజం , అగ్రేరియన్ క్యాప్టలిజం, మార్కంటెలిజం . మోనోపాలి క్యాప్టలిజం. వెల్ఫేర్ క్యాప్టలిజం కార్పొరేటిజం, ఇలా దాని విశ్వరూపం విస్తరించుకున్నది. అయితే ఈ పెట్టుబడి  అనే భావన వెనుక ఉన్న పెద్దమనుషుల చరిత్ర చూద్దాం.


క్యాప్టలిజం యొక్క ఎథికల్ ప్రొఫెన్సి ఇలా ఉంది. జుడాయిజం అన్న మతం మూలాలనుండి క్రిస్టియానిటి , క్రిస్టియానిటీ లోనుండి క్యాతెలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఈ  రెండు గ్రూపుల నుండి రెండు చీలికలు, ఒకటి మాయా మంత్ర తంత్రాల విశ్వాసాలను తగ్గించే వర్గం ఒకటి , ఆర్థిక నీతి సూత్రాలను ఆచరిస్తామనే వర్గం ఒకటి. ఆర్హిక నీతి సూత్ర వాదుల నుండి స్పిరిట్ ఆఫ్ క్యాప్టలిజం వాదులు వస్తారు. వీరూ నిరంకుశుద్యోగ వర్గం కలిసి శ్రమ దోపిడి చేసిన ఫలితంగా  ఏర్పడ్డదే పెట్టుబడి. ఆ విధంగా బ్రిటిష్ వలస దోపిడి ప్రసాదించిన పెట్టుబడి ఇప్పుడు ఇక్కడి జాతీయవాదుల ఆరాధ్య దేవత అయి కూచున్నది. దాని ఫలితమే ఒక్క శాతం మంది దగ్గర ఎనభై శాతం సంపద పోగై ఉన్నది. ఈ సంపద అందరికీ సమానంగా పంచబడాలే అని మొట్టమొదటి సారి చెప్పినవాడు మార్క్స్. ఇట్లా అంటే అన్న వాళ్ళది విదేశీ జ్ఞానం అనో దేశ భక్తి లేని వాళ్ళు అనో నిందిస్తున్నారు.


భారత్ దేశం లో పురాణ పురుషుడు శ్రీ కృష్ణుడు ఒక తత్వవేత్త, ఈయన,  చేయించేది , చేసేది అంతా నేనే, నీవు నిమత్త మాతృడవ్, కర్మ చేయి ఫలితం ఆశించకూ. అంతా నేను చూసుకుంటా అని బోధించినట్లు పురాణాలు చెపుతున్నాయి. ఇక పురాణ కాలం తర్వాత మన దేశం లో చర్చ అంతా పునర్జన్మ , కర్మ సిద్ధాంతం, ఆత్మ,పరమాత్మ, ద్వైతం, కాదు కాదు, అద్వైతం అంటే ఆత్మ పరమాత్మ రెండు కాదు ఒకటే , విశిస్తాద్వైతం, ఆది శంకరా చార్యులు, మద్వైతాచార్యులు, శైవం ,వీరశైవం, వైష్ణవం, భక్తి ఉద్యమాలు, ఇలా ఉపరితల అంశాల పైననే విపరీతమైన చర్చ జరిగింది. కానీ సమాజాలకు ఆధారమైన పునాది ఐన ఆర్థిక విధానాల పైన చర్చ జరుగలేదు. చానుక్యుని అర్థశాస్త్రం కూడా రాచరిక అర్థశాస్త్రమే అయింది కానీ ప్రజల ఆర్థిక సమస్యల పైన కౌటిల్యుని అర్థ శాస్త్రం మాట్లాడ లేదు.


క్రీ పూ. 469- 399 వరకు నివసించిన  గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ వాదించు,ప్రశ్నించు,నిరకుశత్వాన్ని నిలదీయుమని ప్రజలకు బోధించాడు. క్రీ.పూ. 428-348 వరకు నివసించిన ప్లాటో అధిభౌతిక వాదం గురించి ప్రపంచానికి వివరించాడు. ఈ పరంపరలో అరిస్టాటిల్. ఆదమ్ స్మిత్ , జీన్ పాల్ సార్టే, నికోలస్ మాక్వెల్లి , బెర్కెలే, లాంటి తత్వవేత్తలందరు ఉన్న ప్రపంచాన్ని , ప్రపంచం ఈ విధంగా ఉందని వారి వారి పద్దతులల్లో విశదీకరిస్తే , తలక్ళిందులగా ఉన్న ఈ ప్రపంచాన్ని , సరిగా మార్చడం ఎలాగో వివరించన వాడు మార్క్స్..

 

Tuesday, September 4, 2018

ఉపాద్యాయ దినోత్సవం !

                                               

తావి లేని పూవు ఎలాగో  ప్రజా ప్రాయోజితం లేని విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయ వృత్తి కూడా అలాగే ఉంది ఈనాడు. ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఆయాస్తానిక భౌగోళిక పరిస్తితులను బట్టి గుంపుకు, కుదురుకు, గణానికి ఒక భాషను ఏర్పాటుజేసుకొని , వారి వారి దైనందిన జీవితాల్లో వారి భావాలను వ్యక్తం జేసుకోవడానికి భాష ఉపయోగపడింది. వారి సామాజిక భద్రతకు, వారి సాంస్కృతిక జీవనవిధాన ఆచరణకు భాష ఉపయోగపడింది. మనిషి గుంపులు గా, గణాలుగా ఉన్న నాటికి ఆహార సంపాదన, శత్రుదాడి నుండి రక్షణయే ప్రధానంగా జరిగేది. గణ జీవన విధానం కంటే అంతకంటే పెద్దనైన  రాజ్య జీవన విధానం ఒకింత రక్షణగా ఉండగలదన్న విశ్వాసం తో ఆనాటి మానవులు రాజ్యాల నిర్మాణం కు ముందుకు వచ్చినారు. అందుకు సైనిక బలగం, యుధ్ధ విద్యల, బౌధ్ధిక విద్యల అవసరం ఏర్పడింది. అప్పటికే ప్రకృతి ధర్మాలపైనా ఒకింత అవగాహన కలిగి యున్న గణ పెద్దలు నదికి ఏటవాలుగా వెళ్ళితే వేట లభిస్తుందనీ, నీటి లభ్యత దొరుకుతుందని చెప్పడం , అది వారికి ఎలా తెలుస్తున్నదో అర్థం కానీ గణ సభ్యులు , అన్నపానీయాల రేవు తెలుపుతున్నారన్న కృతజ్ఞతతో వారిని గౌరవించడం వలన వారు అప్పటికే పూజారి వర్గంగా గుర్తింపబడియుంటారు .ఇది అన్నీ సమాజాలల్లో, అన్నీ నాగరికతలల్లో ఏక కాలం లో కాకపోయినా క్రమానుగతంగా జరిగి ఉంటాయి.
ప్జ్రపంచ వ్యాప్తంగా ఓడిన గణాలు , యుధ్ధం లో  గెలిచిన గనాలకో , రాజ్యాలకో దాసులు గా లేదా బానిసలుగా లొంగి బతుకవలసిన పరిస్తితులే. ప్రాణాలు కాపాడుకోవాలంటే మరో గత్యంతరం లేని పరిస్తితులు, అయితే భారత దేశం లో మాత్రం అప్పటికే ఇక్కడ సింధు నాగరికత, హరప్పో మహోంజొదారో నాగరికతలు వెళ్లివిరిసిన ఈ నెల పైకి యూరోషియా ప్రాంతం నుండి వచ్చిన ఆర్య తెగల తో జరిగిన యుధ్ధాలలో ఓడిపోయిన స్తానిక మూలవాసులను గెలిచిన ఆర్య తెగలు దాసులుగా చేసుకున్నారు. ఓడిన మూలవాసులను దశ్యులు, ద్రావిడులు అని కూడా అన్నట్లుగా చరిత్ర చెపుతున్నది. ఇప్పుడు కొందరు అదంతా తప్పు ఆర్యులు ఇక్కడి ములవాసులే అంటున్నారు. కానీ ఆర్యులు మూల వాసులే అయితే ఈ ద్రావిడులు లేదా దశ్యులు లేదా ఇప్పుడున్న శూద్రులు ఎవరంటే , గజం మిథ్య ఫలాయణం మిథ్య అంటున్నారు. ఈ వాదనజేసేవారి వద్ద జవాబు లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా బానిస వ్యవస్తా ఏర్పడితే భారత దేశం లో మాత్రం బానిస వ్యవస్తాకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ శూద్రకుల వ్యవస్తను ఆనాటి విజేతలు సృస్టించారు.

చారిత్రిక ఆధారాలను బట్టి ఆది వేదం అయిన ఋగ్వేదం క్రీ. పూ. 15 వ శతాబ్దం కాలం అంటున్నారు. అప్పటి నుండి ప్రారంభమయిన వేద విద్యలు క్రీ. పూ. 5 శతాబ్దం లో బుద్ధుడు వచ్చి బౌద్ధ మతాన్ని వ్యాప్తి జేసె దాకా వేదాలు అపౌరుశేయాలు వాటిని మహిళలు, శూద్రులు ఉచ్చరించకూడదన్న బ్రాహ్మణవాదుల  విధానాలతో విద్య శూద్రులకు అందకుండా పోయింది. మళ్ళీ క్రీ. శ. ఒకటవ శతాబ్దం లో భారత దేశం నుండి బౌధ్ధాన్ని తరిమి వేసిన తర్వాత వేద కాలం కాస్త హైందవ మతంగా లేదా హైందవ ధర్మంగా మారి యాజ్ఞ వల్క స్మృతి మనుస్మృతి అనే కొత్త కోరలతో శూద్రులను అట్టడుగుకు అణగదొక్కి చదువు కాదుకదా కనీసం గౌరవంగా జీవించే పరిస్తితులు కూడా లేకుండా చేసింది హైందవ ధర్మం.

ఎప్పటిదాకా అంటే బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఫ్రీ ఆండ్ కంపల్సరీ ఎదుకేషన్ అనేది మానవుల హక్కు అని 1870 లో చట్టం తెచ్చిన  నేపథ్యం లో 24 సెప్టెంబర్ 1873 లో సత్యశోధక సమాజ్ ఏర్పాటు జేసి శూద్రులు కూడా అందరూ చదువుకోవాలే అనే ఉద్యమం మహాత్మా జ్యోతి బా ఫూలే లేవనెత్తేదాకా శూద్రులందరికి విద్యా అందుబాటులో లేకుండేది అన్నవిషయం మరిచి పోకూడదు.(1835 లో మెకాలే ఎదుకేషన్ చట్టం వచ్చినా అది కొందరు అగ్రవర్ణాల వారికే పరిమితమైంది) . సావిత్రి బాయి ఫూలే కు జ్యోతి బా చదువు నేర్పించి మహిళలకు చదువులు చెప్పించే దాకా భారతదేశం లో శూద్ర జాతికి, మహిళలకు  విద్య అందుబాటులో లేకుండేది . ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలంటే మొట్టమొదటి బహుజనుల విద్యాప్రదాత సావిత్రిబాయి ఫూలే జన్మ దినం అయిన 3 జనవరి ఉపాధ్యాయ దినోత్సవం కావాలి. కానీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం ఉపాధ్యాయ దినోత్సవం కావడం వెనుక ఏ భావజాల ప్రభావం , ప్రయోజనం ఉందో మనం అర్థం చేసుకోవాలి.

భారత దేశ స్వాతంత్ర సంగ్రామం గురించి చదివితే ఆనాడు డా: భీమ్ రావ్ అంబేడ్కర్ ఎవరి నుండి ఎవరికి స్వాతంత్రం కోసం సంగ్రామం జరుగుతున్నది? మా స్వాతంత్రం కోసం జరుగని పోరాటం కోసం మేమేందుకు పాల్గొని పోరాడాలి అని ప్రశ్నించినప్పుడు , ప్రాణాలర్పించేది, రక్తాన్ని ఎరులై పారించే తెగువ కలిగిన బహుజనులు లేకుండా బ్రిటిష్ వాళ్ళ పైన గెలువ జాలమని భావించిన భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ రచనను తప్పని సరి పరిస్తితుల్లో ప్రపంచ ప్రజాస్వామిక ఉద్యమ చరిత్రలను ఔపోశనం బట్టిన అంబేడ్కర్ గారికి ఆ బాధ్యత అప్పగించి కూడా ఎన్ని అడ్డంకులు కల్పించారో అంబేడ్కర్ రచనలు చదివితే అర్థం అవుతాయి. ( అశేష దళిత బహుజనుల రక్తార్పణల పునాదుల పైన అంబేడ్కర్ రాజ్యాంగ ఫలితంగా చదువరులైన కొందరు దళిత బహుజన విద్యావేత్తలు తమ పూర్వీకులను చదువు సంపదలనుండి దూరం జెసి తమ వెనుకబాటు తనానికి అసలైన కారకులను వదిలేసి గత చరిత్రను అవమానాలను మరిచిపోయి వారినే తలకెత్తుకొని పూజిస్తున్నారు).  

డా: అంబేడ్కర్ , భారత రాజ్యాంగం లో ఆర్టికల్ 27 A పొందుపరిచిన 6-14 సంవస్తారాల పిల్లలందరికి నిర్బంధోచిత ప్రాథమిక విద్యను అందించాలని చెప్పిన ఫలితంగా రాజ్యాంగం అమలులోనికి వచ్చిన 26 జనవరి 1950 నుండే భారత దేశం లో దళిత బహుజనులందరికీ ఉచితంగా చదువుకొనే అవకాశం వచ్చింది. ఆ గొప్ప అవకాశాన్ని భారత ప్రభుత్వం ద్వారా తమకు ఉచితంగా అందించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతా పూర్వకంగా  ఆనాటి విద్యార్థి లోకం తరఫున ప్రభుత్వాలు ఉపాధ్యాయ దినోత్సవాలు జరిపించింది. అది ఇప్పుడు ఒక ఆనవాయితీ గా మారింది. ప్రభుత్వాల చిత్తశుధ్ధి లేని , బాధ్యత లేని పరిపాలనా విధానాలకు తోడు కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా అంకిత భావం విడనాడి బిల్ అండ్ బెల్ సిధ్ద్ధాంతాన్ని తలకెక్కించుకున్న ఫలితంగా నేడు ప్రజలల్లో ప్రభుత్వ ఉచిత విద్యపట్ల విశ్వాసం లేకుండా పోయింది. భారత దేశం లో మొదటి నుండి ఉత్పత్తితో , ఆధునిక సాంకేతికతతో సంబందం లేకుండా సాంప్రదాయ వాద విద్యా విధానం అమలు లో ఉన్నప్పటికినీ సేవా రంగం లో కొంతకాలం దాకా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించినాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విద్యా సంస్కరణలను , కరికులం లో జరుగుతున్న ఆధునికతను గమనించ కుండా , అయితే విదేశీ విద్యను యథాతధంగా అమలు చేయడం,లేదా ఏకంగా ఇప్పుడైతే విదేశీ విశ్వవిద్యాలయాలనే ఆహ్వానించడం, ఇంకా కాదంటే క్రీ. పూ. 1500 ఏండ్లనాటి కాలం చెల్లిన విషయాలను అత్యంత ఆధునికాలని నూతన విద్యా విధానం పేరుతో ప్రజలకు ఎక్కించాలని పూనుకోవడం వలన ప్రభుత్వ ఉచిత విద్య ప్రజల్లో మరింత చులకనై పోతున్నది. ఇలాంటి పరిస్తితుల్లో తమకు ఉపాధిని ఇవ్వని , ఉద్యోగం ఇవ్వని సమాజం లో గౌరవం ఇవ్వని విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయుల పట్ల కూడా విద్యార్థులకు తద్వారా విద్యార్థుల తలిదండ్రులకు గౌరవం లేకుకుండా పోతున్నది. ఇక ప్రైవేట్ ఉపాధ్యాయుల గౌరవ మర్యాదల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో.

Saturday, August 4, 2018

తాటి ఈత నీరా శీతల పానీయం గా అభివృధ్ధి పర్చాలి!


తెలంగాణ రాష్ట్రం లో మేము గీతా వృత్తిచేసే సామాజిక వర్గానికి ప్రతినిధులం అని స్వయం ప్రకటిత పెద్దమనుషులు ఇద్దరీలో ఒకరు , ఇక నుండి యువకులు ఎవ్వరూ కూడా గీతా వృత్తిని చేయకుండి అని ఫత్వా జారీ చేశారు. చేయరు సరే, మరి ఆ సామాహిక వర్గానికి చెందిన విద్యాధికులైన వేలాధి యువకులకు వారి సర్కారు లో ఏమైనా ఉద్యోగావకాశాలు కల్పిస్తారా? అలా కాకుంటే వాళ్ళు ఎలా బతుకాలి మరి ? యువతకు వాళ్ళ వాళ్ళ అర్హతమేరకు ఉద్యోగ ఉపాధి చూపించే తాహతు లేదూ, వాడు చేసుకునే పని వాణ్ని చేసుకొనివ్వకుండా ఉచిత సలహా ఇస్తారు. చేసుకొనివ్వరు, ఎలా బతకాలి వాళ్ళంతా ఒక్కడు చెప్పడు.
ఇక మరో పెద్దమనిషేమో సమాజం లో పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు జరుగుతున్నై ఓ టాస్క్ పోర్స్ అధికారులారా మీరు వాల్ల వెంటపడండి , చిన్న చిన్న తప్పిదాలు చేస్తున్న కల్తీ కల్లు కారకులను వదిలేయండి అని ఉచిత సలహా ఇస్తాడు, ఆయన ఒక చట్ట సభకు అధినేత. అటువంటి స్తానమ్ లో ఉండి అలా మాట్లాడ వచ్చా?
నిజంగానే వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి సేవ చేయాలని అనుకుంటే వాళ్ళు మాట్లాడ దానికి ఇంతకంటే అక్కరకు వచ్చే మంచి విషయాలు లేనే లేవా? ఆ పెద్ద మనిషి ఏమంటాడంటే ఎవరిదో దిస్టీ తగిలి గీతా వృత్తి ఇవాళ ఆ వృత్తిదారులకు అన్నం పెట్టలేని నిర్భాగ్యురాలు అయిందట.ఎంత మాయకత్వం నటిస్తున్నారు? కేంద్ర రాస్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని మల్టీ నేషనల్ బ్రెవెరీస్ కంపనీలకు లైసెన్సులు ఇచ్చి పల్లెలకు మద్యం మంచినీళ్ళకంటే సులభంగా అందుబాటులో ఉంచి అది త్రాగడం నాగరికత అని బాకాలు ఊదీ, రాజకీయనాయకులే బ్రాందీ బీరు షాపుల గుత్తేదార్ల అవతారం ఎత్తి పల్లె పల్లె కు వాడ వాడ కు బెల్ట్ షాపులు తెరిచి, మహిళా సంఘాల వాళ్ళు మా సంసారాలు కూలి పోతున్నాయి మద్యం వద్దన్నా కూడా పోలీస్ బలగాల పహరాలో బ్రాందీ బీరు షాపులు వర్ధిల్లుతున్నది తెలియనంతటి అమాయకత్వ నటనను ఎవరు నమ్ముతారనుకుంటారో వాళ్ళకే తెలియాలి.
అయితే నిజంగానే వాళ్ళకు ఏమీ తెలియక అలా మాట్లాడినారనుకుంటున్నారా? హరికీస్ కాదు. వాళ్ళకు అన్నీ తెలుసు. కానీ గొర్రెలను నమ్మించాలి కదా ? . మూల విరాట్టుకు బలి యివ్వాలాయే మరి. అందుకని చెవులల్ల నీళ్ళు పోసి తలవూపించి , జడుత ఇచ్చిందని ప్రకటించుకొని తలుకాయ కోసుకునుడు , కింది మెట్టునుండి పై మెట్టుకు ఎగబాకడానికి రూపాంతరం చెందే క్రమం లో ఉన్న కుల రాజకీయ నాయకులకు బాగా తెలుసు.
పెట్టుబడి రాకాసి అన్నివృత్తులను దిగమింగి వాళ్ళ చేతులు విరుస్తున్నది. సంక్షేమ రాజ్యానికి పాలకులం అని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు కనీసం వాళ్ళ ఉనికి కోసం అయినా చేతివృత్తుల వారికి మేలు చేస్తున్నాము అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
బ్రాందీ, విస్కీలు ఇప్పటికే ప్రకృతి సహజసిద్దమైన, అవుషధీయుక్తమైన కల్లును దెబ్బకొట్టినాయీ. దానికి తోడు గీతి వృత్తిని భ్రస్టు పట్టించే ఆ సామాజిక వర్గానికే చెందిన నయాపెట్టుబడి దార్లు కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడుతూ మొత్తం గీతా వృత్తినే మెడ నరుకే దుస్సాహసానికి ఒడిగడుతున్నారు.
గీతా కార్మికులకు ఇక మిగిలిందల్లా నీరా ఒక్కటే. కనీసం మల్టీనేషనల్ కంపనీల కూల్ డ్రింక్స్ ను అయినా అరికట్టి ,వాటి స్తానమ్ లో నీరాను సాఫ్ట్ డ్రింక్ గా అభివృధ్ధి పరిచి ఒక చెరుకు రసం లా, ఒక కొబ్బరి నీళ్ళ వలె, ఒక ఫ్రూట్ జ్యూస్ వలె స్వేచ్చా మార్కెట్ లో ఎలాంటి లైసెన్సుల గొడవ లేకుండా అమ్ముకొనే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే గీతకార్మికులకు ఉపాధి దొరుకుతుంది అలాగే ప్రజలకు ప్రకృతి సహజసిద్ధమైన కల్తీ లేని మినరల్స్, విటామీన్స్ కలిసిన శీతల పానీయం దొరుకుతుంది.
రాజకీయ నాయకులు దీనికోసం ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షిస్తారు కానీ పస లేని పిస మాటలు మాట్లాడితే జనం లో చులకన అవుతారు.