Sunday, February 12, 2017

ఇంటిమీదెవుసమ్ 26

                                                  
మొన్న పున్నం నాడు సాయంత్రం ,  సూదమ్ రమేశ్ ఆహ్వానం మేరకు ఆయన మిద్దెమీదేవుసమ్  మధ్యన జరుగుతున్న " ఎన్నీల ముచ్చట్లు " సమావేశం కు పోయిన. కరీంనగర్ జిల్లా కేంద్రం ల ఒక సంప్రదాయం గత మూడున్నర సంవస్తారాల కిందనే మొదలైంది. ఎందంటే, కవులు ఎవరికి వాళ్ళే రాసుకొను చదువుకునే కంటే వాళ్ళు , వాళ్ళు, రాసిన కవితలను ఒక రోజు నాడు అందరూ ఒక దగ్గర సమావేశమై కూర్చొని చదువితే ఒకరికి మరొకరి ఇనిస్పిరేషన్ ఉంటుందని ,  అది పున్నమ అయితే బాగుంటుందని మొదలు పెట్టుకున్నరు. ప్రారంభం లో నేను కూడా వెళ్ళే వాన్ని . చాలా రోజుల తర్వాత ,  రమేశ్ ఆహ్వానం మేరకు ఇగో ఈ రోజు మళ్ళా వెళ్ళిన. ఆడ మగ కవులు అందరు కలిసి దాదాపు నలబై మంది అక్కడ జమ అయినారు.  ఉన్న వాళ్ళల్లో వయస్సు లో బహుశా నేనే పెద్దవాన్ని కావడం మూలాన, పెద్ద వయస్సు వలన చరిత్ర లో జరిగిన అనేక సంఘటనలకు  సాక్షులుగా  ఉంటూ ,  తద్వారా వ్యక్తులు పొందిన  అనుభవాలు ఉంటాయి కదా  ? అందుకనే ఏమో నన్ను అతిథి గా భావించి నాలుగు ముచ్చట్లు చెప్పుమన్నరు .

నేను 1984 నుండి 2001 లో నేను ఏం. ఇ. వో . అయ్యేదాకా APTF , DTF  , ఉపాధ్యాయ సంఘం లో చాలా క్రియా శీలకంగా పని జేసిన అనుభవం ఉంది.   ఉపాధ్యాయ సంఘంగా అప్పుడు మేము " విద్యా వైజ్ఞానిక సభలు " , రాష్ట్ర, జిల్లా , మండల స్తాయి లో అనేకంగా  జరిపే వాళ్ళం . ఉపాధ్యాయులకు, యువకులకు, ఆ ప్రాంతం లో ఉండే ప్రజానీకానికి  సమ కాలీన సామాజిక, ఆర్థిక రాజకీయ విషయాల పైన నిష్ణాతులైన వ్యక్తులతో ,  ప్రసంగాలు ఇప్పించి , వారికి సమాజం లో జరుగుతున్న అనేక విషయాల పైన అవగాహన కల్పించే ప్రయత్నం చేసేవాల్లమ్ .ఈ కార్యక్రమాలకు ఆర్ . రవీందర్ రెడ్డి, ఆకుల భూమయ్య సార్లు ఆద్యులు. నా లాంటి చాలా మందిమి ఆ స్రవంతి లో కలిసి పని జేసిన వాళ్ళం .

ఆ సందర్భంలో హైద్రాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం నుండి  ప్రొ. డి . నర్సింహా రెడ్డి , ఆర్థిక శాస్త్రం మూలాలు, ప్రొ. హరగోపాల్ సామాజిక శాస్త్ర పరిణామ క్రమాన్ని, సంబల్ పూర్ విశ్వ విద్యాలయం ప్రొ. ఆర్. ఎస్. రావ్ ఆర్థిక అంశాల వెలుగు నీడలు, ఆనాటి  సీఫెల్ రెజిస్ట్రార్ ప్రొ. జయశంకర్, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొ. బియ్యాల జనార్ధన్ రావ్ ప్రాంతీయ అసమానతల గురించి, ప్రొ. కాత్యాయిని విద్మహే , వోల్గా లాంటి వారు స్త్రీ వాద సాహిత్యం గురించి , సియెస్సార్ ప్రసాద్ రాజకీయ ఆర్థశాస్త్రం శాస్త్రం, వి. చెంచయ్య , ఆకుల భూమయ్య గతితార్కిక భౌతిక శాష్టం గురించి , డా: కె. శివా రెడ్డి, డా: నందిని సిధా రెడ్డి లాంటి వారు ప్రజల పై  సాహిత్య ప్రభావం గురించి, వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ విజన్ 20 : 20 , రామజన్మ భూమి పైనా , అద్భుతమైన ప్రసంగాలు చేసే వాళ్ళు. ఆ సందర్భంగా నేను కూడా ఆ ప్రసంగాలు విన్న వాన్ని.

అట్లా యాదికి ఉన్నవాటిలో కొన్ని విషాయాలు వాళ్ళతో పంచుకోవడం జరిగింది. ఎన్నీళ్ళ ముచ్చట్ల వ్యవస్తాపక నిర్వాహకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ బూర్ల వెంకటేశ్వర్లు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ  కవులు గా , బుధ్ధి జీవులుగా మనం ఆచరణ వాదులమ్ అయి ఉండాలే , అనేక విషయాలు రాసీ, చెప్పి ఆచరించకుంటే అర్థం లేదు అన్నారు. ఆ తర్వాత కవులు తమ కవితలను , పాటలను పాడి వినిపించారు. సూదమ్ రమేశ్ చిన్న కూతురు గాయిత్రి పదవ తరగతి అమ్మాయి కూడా తన కవిత్వాన్ని వినిపించింది. రమేశ్ అయితే మిద్దె తోట మీదనే కవిత్వం రాసి వినిపించిండు .వ్యవసాయమంటే ఏమిటో తెలియని తనను , భూమిలో వేసిన  గింజ , ప్రకృతి లోని గాలి, తేమ , సూర్య రశ్మి ప్రభావం వలన పులకించి మొనదేలి మొలకై , భూమిని పట్టున , పగులగొట్టుకొని    మొలకెత్తి , తనను ఆవహించి  పచ్చని చెట్టుగా చిగురింప జేసిందని  మురిసి పోయిండు . సమావేశం లో పాల్గొన్న వాళ్ళంతా మిద్దె తోటను ముచ్చటగా తిరిగి చూసిండ్రు.  వీలున్న వాల్లమందరం  రాసాయనాల కలుషితం కానీ కూరలను పండించుకొని తినాలే అని ముచ్చట్లు పెట్టుకున్నరు. " ఎన్నీల ముచ్చట్లకు మిద్దె తోట ముచ్చట్లు " తోడైనై . చివరగా మిద్దెతోట పైన రమేశ్ పండించిన టమాటకు ఆలుగడ్డ కలిపి వండిన ఆలూ టమాట కూర్మాతో వచ్చిన వాళ్ళందరికీ  వేడి వేడి  చపాతీలు తినిపించి పంపించిండ్రు రమేశ్ కుటుంబ సభ్యులు.

No comments:

Post a Comment