Thursday, March 16, 2017

యాది - మనాది 3

                                                 

భూమయ్య సార్ ఉన్నప్పుడు ఒకసారి మేమిద్దరం కలిసి సర్వాయి పాపన్న జీవిత చరిత్రమీద ఒక పరిశోధన గ్రంధం రాద్దామని అనుకున్నము . అప్పటికే కొంపల్లి వెంకట్ గౌడ్ పాపన్న పైన ఒక మంచి పుస్తకమే తెచ్చి ఉన్నాడు. కానీ  కర్ణాటక ప్రభుత్వం తన విశ్వవిద్యాలయాలల్లో టిప్పుసుల్తాన్ చరిత్రను పాఠ్యాంశం గా చేర్చడానికి కారణమైన పుస్తకం స్తాయి లో సర్వాయి పాపన్న పైన సాధికారికమైన పరిశోధనాత్మక పుస్తకం తెచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా ఒక బహుజన వీరుడు " భారత దేశపు తొలి ప్రజాస్వామిక విప్లవ వీరుని " గా ఎదిగిన క్రమాన్ని విద్యార్థులకు బోధించే పరిస్తితిని తేవాలని అనుకున్నాము. దళిత బహుజనులకు రాజ్యాధికారం కావాలని ఒక పెద్ద చర్చే జరుగుతున్నది అప్పటికే. అందుకని రాజ్యాధికారం అంటే ఏమిటి ? రాజ్యాధికారం ఎందుకోసం దళిత బహుజనులకు కావాలో , చరిత్రలో దళిత బహుజనులకు రాజ్యాధికారం ఎప్పుడూ రానే లేదా ? వచ్చినప్పుడు వాళ్ళు ఏమి చేశారు? మరి ఇప్పుడు వస్తే ఏమి చేస్తారో చెప్పే స్పస్టమైన ఎజెండా వారికి ఉందా ? ఏ ఎజెండా పైన రాజ్యాధికారం కోసం దళిత బహుజనులు డిమాండ్ చేస్తున్నారు ? దళిత బహుజనులకు రాజ్యాధికారమే ఏకైక ఎజెండానా ?  దానికి  చరిత్ర లో ఛత్రపతి శివాజీ, సర్వాయి పాపన్నలు ఏమి చేశారో శాస్త్రీయ ఆధారాలతో నిరూపించే  పరిశోధక పుస్తకం పుస్తకం తేవాలన్నది ఆయన సంకల్పం. దానికి ఇద్దరం కలిసి పనిజేయాలని అనుకున్నాము. దానికి ఆరంభము గా ఆయన " భారత తొలి ప్రజాస్వామిక విప్లవ వీరుడు సర్వాయి పాపన్న " అంటూ ఒక వ్యాసం రాసిండు. అది ప్రింట్ మీడియా లో కూడా వచ్చింది. అయితే అనుకున్న  ఆ పని పూర్తిచేయకుండానే అర్ధాంతరంగా ఆయన వెళ్లిపోయిండు . . ఆ క్రమం లో మా ఇద్దరి మధ్య జరిగిన చర్చలు, చర్యలు , నాకు యాదికి ఉన్నంత వరకు అందరితో పంచుకోవాలన్న తపన తో ఇది రాస్తున్నాను.  

సర్వాయి పాపన్న కు సంబంధించిన ఏ ఆనవాలు కూడా మిగులకుండా  ఆనాటి హైందవ, మహ్మదీయ పాలకులు వెదికి వెదికి ధ్వంసం చేశారు. చివరికి ఆయన చిత్రపటం గూడా పేర్వారం జగన్నాధం గారు లండన్ మ్యూజియం నుండి తెచ్చే దాకా ఆయన ఆనవాలు జానపదుల గొంతుల్లో తప్ప ఎక్కడా ఏమీ లభించనంతటి విధ్వంసం , భయోత్పాతాన్ని సృస్టించి గానీ వదిలివేయలేదు. ఆ ఫోటోను  కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళక పోయి ఉండి  ఉంటే ఇక్కడి రెడ్డి, వెలమ, బ్రాహ్మణ పాలకవర్గాల వారి ప్రతినిధులు ఆ చిత్రపఠాన్ని గూడా చింపివేసి ఆనవాలు లేకుండా చేశామని చంకలు గుద్దుకొనే వారు కదా అని మేము అనుకున్నాము. ఎందుకు వాళ్ళకు అంత కసి ద్వేషం అని నేను ప్రశ్నించినప్పుడు , భూమయ్య సారు చెప్పింది ఏమంటే , భగవత్ గీత లో బ్రాహ్మణులు కృష్ణభవానుని తో చెప్పించిన " చాతుర్ వర్ణం మయం సృస్టీ , గుణ కర్మానుసారమ్ " అన్న విషయాన్ని గుర్తు జేసి , శూద్రులు సేవక వృత్తులవారు మాత్రమే . వారు రాజ్యాధికారానికి అనర్హులు , అని బ్రాహ్మణ భావజాలం బలంగా నమ్ముతుంది. కనుక కడ  జాతి వాడు రాజ్యాధి కారి ఐతే మను ధర్మ శాస్త్ర ప్రకారం శిరచ్ఛేదన విధించాలని వారి విశ్వాసం . కనుకనే కడజాతి వాని నాయకత్వమే కాదు, వానికి ఆస్తి హక్కు గానీ , ఆయుధధారణ హక్కు గానీ ఉండబోదని వారి శాస్త్రాల్లో రాసుకున్నారు. అందుకనే చాలా కాలం దాకా శూద్రులకు ఏ హక్కులు లేకుండేటివి . బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవజేసుకోవడమే వారికున్న హాక్కులు. ఐతే  9 వ శతాబ్దం లో కాకతీయ రాజుల కాలం లో యుధ్ధ అవసరాలకొరకు బలశాలురు అయిన కొందరు శూద్రులను శుధ్ధ శూద్రులు గా పుణీకరించి సైన్యం లో చేర్చుకున్నారు. అట్టి వారిలో వెలమలు గా చెలామణి అవుతున్న పద్మనాయకులు, రెడ్లు గా చలామణి అవుతున్న వ్యవసాయాధారులైన కాపులు అని చెప్పారు.అప్పటి నుండి ఈ రెండు సామాజిక వర్గాలకు ఆయుధ హక్కు, ఆస్తి హక్కులు సంక్రమించాయి. అయితే వీరు తమ మూలాలు మరిచిపోయి రాజును మించిన రాజా భక్తి తో శూద్రులను అణిచివేయడానికి ముందు వరుసలో ఉన్నారు అన్నాడు. ఇక్కడే ఆయన నాకు శివాజీ పట్టాభిషేకానికి పూనా బ్రాహ్మలు నిరాకరించిన కథ చెప్పారు. ఔరంగా జేబు తో అనేక యుధ్ధాలు జేసి ఎన్నో కోటలను స్వాధీనం చేసుకున్న తర్వాత తాను పట్టాభిషేకం  చేసుకొని సింహాసనాసీనుడు కావాలని భావించి , తల పైన కిరీటం బ్రాహ్మణుడే పెట్టాలనే నియమం ప్రకారం బ్రాహ్మణుడిని ఆహ్వానిస్తే , పూణే లోని బ్రాహ్మలు అందుకు నిరాకరించి నపుడు కాశీ నుండి లక్ష వరహాలిచ్చి పండితుణ్ణి రప్పించి పట్టాభిషేకం చేయించుకుంటాడట . అలా ఎలా జేస్తారని పూనా పండితులు ప్రశ్నిస్తే శివాజీకి రాజ అంశ ఉంది కనుకనే ఆయన రాజయినాడు. అని అంటూ సూర్యవంశం వారసుడని వరుస కలిపారట . ఆ లక్ష వరహాలు మాకే ఇస్తే ఈ మాత్రం పని మేము చేయక పొదుమా అని నిస్టూరమాడితే ,  మీరేందుకు నారాజు అవుతారని శివాజీ , పూనా పండితులకు కూడా 50 వేల వరహాలు ఇచ్చి సాగనంపాడట అని చెప్పాడు .

సర్వాయి పాపన్న జీవించి ఉన్న కాలం లో ఫ్రెంచ్, ఆంగ్లేయుల చరిత్రకారులు ఇక్కడ పర్యటించిపోయి ఉన్నారు కనుక ఆయా దేశాల పురా వస్తు ప్రదర్శన శాలల్లో గానీ , మ్యూజియం లల్లో గాని పాపన్నకు సంబంధించిన విషయాలు లభించ వచ్చు కదా అన్న ఆలోచనలతో ఆ రెండు దేశాలకు వెళ్ళి రావాలని అనుకున్నాము. ( సశేషం )

No comments:

Post a Comment