Sunday, March 12, 2017

ఇంటిమీదెవుసమ్ 34

                                                              

ఎవుసమ్ ఫలితం కొంత  నిరాశా జనకం కావడానికి నాకైతే కోతుల బెడద, నాసిరకం విత్తనాలకు తోడు పగలు అలివిగాని  ఎండ, సాయంత్రాలు గాలి దుమారం,కారణాలు అవుతున్నాయి.  అయినా విడిచి పెట్టేది లేదూ , కాసినన్నే ఆయే అనుకుంటా . అయితే మనుసున పడుతలేదు అన్నప్పుడల్లా చిన్ననాటి మిత్రుడు నాగేందర్ వద్దకు వెళ్తుంటాను . మొన్నోకసారి నేను వెళ్ళే వరకు ఆయన అప్పుడే ఆయన ఒక సినిమా చూసిండట, దాని కథ చెప్పుకొచ్చిండు.

సగం ల నుంచే చూసిండట . సినిమా లో హీరో చనిపోతాడట. హీరో చనిపోవడాన్ని దర్శకుడు సింబాలిక్ గా ఇలా చూపాడట .  పక్షులన్నీ వలస పోతుంటాయట , అలిసి , శక్తి క్షీణించి  పోయిన పక్షులు కొన్ని అనివార్యంగా  చనిపోతుంటాయట . చనిపోయే వాటికి ఇక నేను రెక్కలు ఆడించ లేను అన్న సోయి కలిగే ఉంటాయట కానీ తన నిష్క్రమణ గుంపు పక్షులకు తెలియ కుండా వెనుకకు తప్పుకొని తను రాలిపోతూ కూడా గుంపు ప్రయానం ముందుకు సాగడానికి సహకరిస్తాయట . ఆ విషయం చెబుతూ అది ప్రకృతి ధర్మం.  ప్రకృతి ధర్మం అని అంటూనే ఈ వలసలు అనేవి అనాది నుండి ఉన్నవే, వలసల కారణంగానే జనసమూహాల నాగరికత సుసంపన్నం అయింది అనడానికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు అన్నాడు. అయితే వలస వచ్చిన పక్షులు అయిన జంతువులు అయినా అప్పటికే స్టానికంగా ఉన్న ఆయా సమూహాల పైన ఆధిపత్యం చలాయించినప్పుడు ఘర్షణలు తప్పవు. అప్పుడూ తప్పలేదు ఇప్పుడూ తప్పదు అన్నాడు. క్రీ: పూ: 5 వేల ఏండ్ల కిందటి మెసోపోటేమియా నాగరికత, క్రీ : పూ: 3500 కిందటి సింధూ లోయ నాగరికతలకంటే ముందు ఉన్న "గణ" జీవితాల సమయం లో కూడా కొత్త గణాలు వచ్చినప్పుడు అంతవరదాక ఆ ప్రాంతం లోతిరుగాడుతూ  ఉన్న గణాలు తమకు ఆహారం తగ్గిపోతున్నదని కొత్త గణాలను చంపివేయడం ఆ క్రమం లోనే గణాల స్తానమ్ లో రాజ్యాలు రావడం, ఆ రాజ్యాలు కూడా సరిపోక సామ్రాజ్యాలు రావడం , ఆ మార్పోల్లో ఎన్ని యుధ్ధాలు ఎంత జన హననం జరిగిందో చరిత్రలో చదువుకున్నాము. అట్లాంటి మానవ హననాలు ఇక ముందు జరుగకూడదనే అనేక వ్యవస్తలను మానవ సమాజాలు ఏర్పాటు జేసుకున్నాయి. కానీ కొందరు దుందుడుకు స్వాభావుల కారణంగా వ్యవస్తాలన్నీ కాలరాయబడి మానవ సమాజాలు భయాందోళనలకు గురికావాల్సిన పరిస్తితి ఏర్పడుతున్నదని అంటూ , ఏదీ ఆగదు , మార్పు అనేది సహజం, ఏ మార్పు కోసం ఇది జరుగుతున్నాదో వేచి చూడాల్సిందే అన్నాడు.  

No comments:

Post a Comment