Wednesday, January 25, 2017

రాజ్యాంగ వ్యవస్తలు కూలిపోతున్నై 2

                                              రాజ్యాంగ వ్యవస్తలు కూలిపోతున్నై 2

ఆబ్కారి శాఖ లో పనిజేస్తున్న మా మిత్రుడు యుగంధర్ ఫేస్ బుక్ లో ఒక వీడియో పోస్ట్ చేసిండు. అందులో ఒక సి ఐ మీడియా తో మాట్లాడుతూ ప్రతి బ్రాందీ షాప్ నుండి వారు నెలకు 50 వేల లంచాలు వసూలు జెసి పై అధికారులకు పంపితేనే ఎవరి వాటా వారు తీసుకొని వీరి నెల జీతాలు విడుదల చేస్తారట . లేదంటే అడ్డగోలు స్కాడ్ లు వేసి వేధిస్తారట . ఆయన బైటికి వచ్చి మీడియా తో అంత ఓపన్ గా చెప్పాడు. కొద్ది రోజులక్రితం సిద్దిపేట డివిజన్ లో ఒక పోలెసు అధికారి గ్రానైట్ లారీల నుండి లంచాలు వసూలు చేసి ఇవ్వలేనని ఆత్మహత్య ఛేసుకున్న విషయం చూశాము. నయీమ్ అనే ఒక మాజీ నక్సలైట్ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల,పెద్ద పెద్ద ఐ ఎ ఎస్,  ఐ పి ఎస్ , అధికారుల అండదండలతో వేల ఎకరాల భూమి  కబ్జా జేసి, పదుల సంఖ్య లో హత్యలు, మాన భంగాలుచేసి నట్లు గా మీడియా లో లీకులు చదివాము. సర్కారేమో అటువంటిది ఏమీ లేదని ఏకంగా కోర్టుకే చెప్పేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఒక ఐ   పి  ఎస్ అధికారి ఎర్ర చెందనం రక్షించే క్లూస్ టీం బాస్ అయి ఉండి కూడా ఆఫీసు లో జరుగుతున్న లీకుల మూలంగా ఎలా చేస్టలుడిగి ఉండి పోవాల్సి వస్తున్నదో అంటూ ఏకంగా మీడియా ముందే వాపోయాడు.

మొన్నటికి మొన్న ఒక బార్డర్ సిపాయి తనకు పెడుతున్న భోజనం ఎ పంది కొక్కులు తినిపోతున్నాయో అంటూ మీడియా ముందు ప్రాణ భయం తో బిక్కుబిక్కు మని వాపోయింది చూశాము. నోట్ల రద్దు, దాని పర్యవసానం, ఆ సంధర్భంగా వచ్చిన పాత నోట్లు ఎన్ని? ముద్రించిన కొత్త నోట్లు ఎన్ని ? దానికి సంబంధించిన ఫైల్ పరిశీలించుటకు వచ్చిన పార్లమెంటరీ కమిటీ ముందు ఆర్ బి ఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ జవాబు చెప్పకున్నా ఫరువాలేదని సాక్షాత్ పరిశీలించడానికే వచ్చిన మాజీ ఆర్ బి ఐ గవర్నర్ మద్దతుగా నిలుస్తాడు . ఎవరి ప్రయోజనాల కొరకు ఎవరు ఎవరిని కాపాడుతున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. బొగ్గు కుంభకోణం, టెలికాం కుంభకోణం, జి3 కుంభకోణాలకు లెక్కలేని , బాధ్యత లేని , భయం లేని రాజ్యం అయిపోయింది . చత్తెస్ గఢ్ లో సుప్రీం కోర్టు ఆదేశాలను లెక్కజేయకుండా ఇప్పటికీ కొత్త మొఖం తో సల్వా జూడుం  , జులుం నడుస్తూనే ఉంది.

రేపు రాజ్యాంగం అమలు లోకి వచ్చిన రోజును భారత ప్రజలు గర్వంగా జరుపుకోబోతున్నారు. కానీ బలిసిన  వారి ప్రయోజనాల కోసం రాజ్యాంగ వ్యవస్తలను ఇలా కూల్చి వేస్తూ పోతుంటే ఈ రాజ్యాంగం పైన ప్రజలకు విశ్వాసం ఎలా బలపడుతుందో రాజ్యాంగ నేతలు ఆలోచించాల్సిన విషయం .

No comments:

Post a Comment