Thursday, January 5, 2017

ఇంటిమీదేవుసమ్ 18

ఇంటిమీదెవుసమ్ 18



నేను నాటిన మొక్కలు సరిగ పెరిగి పుష్పించడం లేదన్న బాధను ఈ విషయం లో అనుభవగ్నుడైన రఘోత్తం రెడ్డి సార్ తొ పంచుకున్నప్పుడు ,  తెలిసిన విషయాలే ఐనా మరో సారి ఆయన గుర్తు చేసిండు .                         అవీ మీతో శేర్ చేసుకుందామని ! ఏ పంటకు ఐనా సహజంగా తాను పులకరించి పుష్పించి ఫలించే ఒక ౠతువు అంటూ ఉంటుంది . మన మన అనుభవాలల్లో వానా కాలం మొదలైందంటే , పుడమి తల్లి ఒడలంతా తడిసిందంటే ఇగ మనం ఎవుసం శురూ జేద్దుము . వరి నార్లు వోసుడైనా , పెసల్లు అలుకుడైనా , ఏ విత్తనం ఐనా ముందో మందు అని ఐన్ మీద నాట్లువడాలె అని అన్ని ఇండ్లల్ల ఇత్తునం బెట్టుడు శురూ అయ్యేది .
అస్సల్ అన్నంబెట్టే పంటల పని కాంగానె కూరగాయల మొక్కల పని మొదలయ్యేది . బీర పాదులు , పొట్ల పాదులు , చిక్కుడు , బెండ , ఇట్లా అన్ని కూరగాయల సాగు మొదలయ్యేది . నా చిన్నప్పుడు తోట కూర  సాగు ప్రత్యేకంగా జరుగక పోయేది . మక్క తోట , మిరుప తోట ల కావలిసినంత తోట కూర పైసలు లేకుంటనె ఎవరైన తెంపుకుందురు .
అప్పటి ఆ వాతావరం , వర్షాలు గాలిలో తేమ , ఆ పంటలకు సరిగ్గా సరిపోయేది . కాని అత్యాపేక్ష పరుడైన మనిషి స్తల కాలాలతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో అన్ని పంటలు పండించడానికి పూనుకుంటున్నాడు . ఆ వాతావరనం వాటికి అనుకూలించక చీడ పీడనల బారిన పడుతున్నాయి . వైరస్ తెగులు సోకుతున్నది . మనిషి తన అతి తెలివిని ఉపయోగించి రక రకాల రసాయన మందులను వాటిపైన ఎగజిమ్మి కాల్లు గట్టి పాలువిండినట్టు అననుకూల పరిస్తితిలో ఐనా పంట దీస్తున్నడు .
కాని కాపుతో పాటుగా అవిమోసుకవస్తున్న రసాయనాలు , హార్మోన్లు , ఖనిజ లవణాల అవశేషాలు మనుషుల శరీరాల్లో ప్రవేశించి అలివిగాని రోగాల బారిన పడేస్తున్నాయి . కనుక మనం గూడా ఏ సీజన్ లో పండే పంటను ఆ సీజన్ లో వెసుకొని ప్రక్రుతికి దగ్గరగా జీవిస్తే ప్రాణానికి హాయిగా ఉంటుంది .  కదా !

No comments:

Post a Comment