Thursday, January 12, 2017

ఇందుకు బాధ్యులెవ్వరు ?

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రాస్  బడిని తనిఖీ చేసిండు. పిల్లలు వాళ్ళ పేర్లు , తలిదండ్రుల పేర్లు తప్పుగా రాసిండ్రు. బస్. సార్లను సస్పెండ్ చేసిండు. శబ్బాస్ !
జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ సాబ్ బడి తనిఖీ జేసిండు. ముగ్గురు సార్లను ఇంటికి బంపిండు.  శబ్బాస్ ! రోనాల్డ్ రాస్ సార్ నిజామా బాదు ల ఆదిల బాదుల అక్కన్నో ముడేండ్లు ఇక్కన్నో మూడేన్లు పని జెసి నట్టే ఉన్నది. ఆయిన పని జెసి వచ్చిన కాడ బల్లన్ని బాగు పది పోయిన యా ? ఆహా ! విమర్శించడం  కాదు గాని,  ఇన్ని రోజుల సంది సర్కారు బళ్ళు ఇంతకంటే మంచిగా నడిచినయా ? ఇప్పుడే చెడిపోయినయా ?  ఇంత కోపం ఎందుకొచ్చే పెద్ద సార్లకు. కడియం సార్ బళ్ళను దురస్తు జేస్తా అన్నాడో లేదో కలెక్టర్ సాబులు కత్తులు దీసుకొని కుత్తుకలు ఉత్తరిస్తుండ్రు.

టీచర్లది  అస్సలే తప్పు లేదని వాళ్ళను నేనేమీ సమర్థించడం లేదు . కానీ ఇప్పుడు ఈ కలెక్టర్లు ఎత్తి చూపుతున్న తప్పులు ఇప్పటికిప్పుడే తయ్యారు అయినయా లేక దశాబ్దాల ఉదాసీనత  ఫలితమా ఒక సారి ఆలోచించాలే. 1990 నూతన విద్యా విద్యా విధానం వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల అనుయాయులు, కొండొకచోట రాజకీయ నాయకులే ప్రైవేట్ విద్యా సంస్తలను ప్రారంభించారు. అవి లాభాల బాట పట్టడానికి ప్రభుత్వ సంస్థలను బలహీన పరిచారు. ఉపాధ్యాయుల ఖాళీలను ఏండ్ల తరబడి నింపలేదు. సర్కారు బడులల్లా చదువు చెప్పే టీచర్లు సరిపోయినంత మంది ఉండరినే అభిప్రాయం కలిగించింది రాజకీయ వ్యవస్తే. 1990 నుండి 2000 దాకా ఈ రకమైన దాడి జెసి ఆ తర్వాత GATT WTO ల ఒప్పందం మేరకు ప్రబుత్వ రంగ సంస్థలను బొందబెట్టే కార్యక్రమం లో భాగంగా ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేశారు. 2010 వరకు ఆ పని సంపూర్ణం జేసిన సర్కారు, 2010 నుండి సెకండరీ విద్య వెంట బడి ఆ కార్యం కూడా ముగించింది. ఇక ఇప్పుడు విశ్వవిద్యాలయాల భరతం పట్టే పనిలో నిమగ్నమైంది. అయితే అది చేస్తున్న పనికి ఒక విశ్వసనీయత కావాలి. అందుకే , ఈ సస్పెన్షన్లు , టీచర్లను భయబ్రాంతుల చేయడం, ప్రజల్లో బాదునామ్ చేయడం అందుకే. కనుక రోగికి  ఎయిడ్స్ రక్తం ఎక్కించిందీ తనే , ఆ వ్యక్తి ఎయిడ్స్ రోగీ అని వెక్కిరిస్తున్నదీ తనే.

WTO ,  GATT ల ఆదేశాల మేరకు ప్రభుత్వాలు  ఇవ్వాళ విద్య ను మొత్తంగా ప్రైవేటీకరించడానికి  నిర్ణయించుకొని, రాజ్యాంగం లోని ఆర్టికల్స్ 41 నుండి 45 వరుకు రాసిపెట్టిన నిర్బంధోచిత ప్రాథమిక విద్యను పాతరేస్తున్నాయి .  మన పాలకులకు భారత రాజ్యాంగం కంటే గూడా WTO ,  GATT ల ఆదేశాలే శిరోధార్యం అయినట్టు ఉంది.

ఆ టీచర్లకు చదువు నేర్పింది ఈ సర్కారు వ్యవస్తే, ఆయనను టీచర్ గా ఎంపిక జేసింది ఈ సర్కారు వ్యవస్తే, ఆయన్ను ఇంతవరదాకా చదువు చెప్పకున్నా ఉపేక్షించింది ఈ సర్కారు వ్యవస్తే, అవ్వన్నీ సర్కారు వ్యవస్తాకు తెలిసే జరిగినాయి కదా ? ఈ విద్యా వ్యవస్తాలు ఇలా చెడి పోవడానికి, ఆ ఉపాధ్యాయుడు, ఆ హెడ్ మాస్టర్, ఆ ఏం ఈ వో, ఆ డి ఈ వో.. ఆ కలెక్టర్, ఆ  విద్యా మంత్రి, ఆ  ముఖ్య మంత్రి, ఆ  ప్రధాన మంత్రి అందరు బాధ్యులే.

ప్రవేట్ అంటేనే వారి పెట్టుబడికి లాభాల గ్యారెంటీ  కావాలి . అడిగినంత ఫీసు చెల్లించి చదువిన చదువరి,  తను పెట్టిన పెట్టుబడి పోనూ లాభం కోరుకుంటాడు. డబ్బు పెట్టి చదువు అనే సరుకు కొంటాడు. ఆ విద్యను ఒంట బట్టించుకొన్న ఆ మనిషి తానే సరుకై అంగట్లో నిలబడి అమ్ముడు పోతాడు. ఆ  మనిషి రక్తం, మెదడు, అంతా సరుకే. సరుకులు అమ్ముకోవడం సొమ్ముజేసుకోవడం వ్యాపార నీతి. ఇక నుండి మానవ సమాజం పరస్పర సహకారం, సామరస్య పూర్వక సహజీవనం కాకుండా వ్యాపార నీతి ప్రధానంగా ఉంటుందన్న మాట. అటువైపు మన విద్యా విధానాన్ని నడిపిస్తున్న రాజకీయ వ్యవస్తాను డిస్ మిస్ జేయడం న్యాయమా ? అక్కు పక్షి బడి పంతులును సస్పెండు జేయడం న్యాయమా వ్యవస్తా ఆలోచించాలే. !

No comments:

Post a Comment